30-05-2025 01:11:19 AM
- కార్యకర్తలను కడుపులో పెట్టుకొని కంటికి రెప్పలా చూస్తాం
- ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ
కామారెడ్డి, మే 29 (విజయక్రాంతి );, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు పదవులు బాధ్యతలు ఇవ్వడం మా లక్ష్యం అని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మొహమ్మద్ అలీ షబ్బీర్ అన్నారు.
గురువారం కామారెడ్డి కింగ్స్ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన కామారెడ్డి నియోజకవర్గ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశానికి హాజరై ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కష్టపడ్డ ప్రతి కార్యకర్తను కడుపులో పెట్టుకొని కంటికి రెప్పలా కాపాడుకుంటామని క్రమశిక్షణ కలిగిన కార్యకర్తకు ఎప్పుడు గుర్తింపు ఉంటుందన్నారు.
అభివృద్ధి చేయడంలో పోటీపడాలే తప్ప అడ్డుకోవడంలో కాదని స్పష్టం చేశారు. కామారెడ్డి అభివృద్ధికి ముందుండి కలిసి రావాలి తప్ప అడ్డు కోవడానికి ముందు కాదన్నారు. ఈరోజు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం కుల గణన నిర్వహించి దేశానికే ఆదర్శంగా నిలిచింది.
ప్రజలు మనల్ని నాయకులుగా ఉన్నందుకు ప్రజల సమస్యలు తీర్చడానికే ఎక్కువ సమయం ఇవ్వాలని, అప్పుడే ప్రజా నాయకులం అవుతాం తప్ప పదవుల కోసం పాకులాడితే కుదరదని తేల్చి చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీ రాష్టానికి చేసిందేమీ లేదు. ప్రజలను రెచ్చగొట్టి అధికారం లోకి రావాలని చుస్తుంది తప్ప ప్రజలకోసం పనిచేయడం లేదు.
పెహల్ గావ్లో ఉగ్రవాదులు డాడీ చేసి అమాయ కులను పొట్టన పెట్టుకుంటే కాంగ్రెస్ పార్టీ పాకిస్తాన్ ఉగ్రవాదంపై ఎలాంటి చర్య తీసుకున్న కేంద్రానికి అండగా ఉంటామని మా అధిష్ఠానం మద్దతు తెలిపిందనిన్నారు. డొనాల్ ట్రంప్ ఫోన్ చేసాడని కాల్పులు విరమించి వెనక్కి తగ్గి మాసైనికుల ఆత్మ స్టైర్యని దెబ్బ తీశారు.
1971 అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ పరాయి దేశాలు మా అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోవద్దని, ఎవరికి తలొగ్గకుండా యుద్ధం చేసి 95వేల పాక్ సైనికులను బందీ లను చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది ఇందిరా గాంధీ ది అన్నారు. ఇవన్నీ మనం ప్రజలకు చెప్పాలి. అప్పుడే వారు ఆలోచిస్తారని తెలిపారు.
ప్రజలకు సేవ చేసే విధంగా కాంగ్రెస్ నాయకులు లక్ష్యం పెట్టుకోవాలి. యంత్రాంగంలో జరిగే తప్పులను సరిచేస్తూ ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలి చిన్న చిన్న గొడవలకు వివాదాలు చేస్తే పార్టీ నుండి సస్పెండ్ చేస్తాము.కార్యకర్తలు ఐక్యంగా ఉంటే అందరికీ పదవులు ఇచ్చే విధంగా కృషి చేస్తాం అని హామీ ఇచ్చారు.
ఇన్ని రోజులు కార్యకర్తలు మన గెలుపు కోసం కష్టపడ్డారు ఇప్పుడు వారి రుణం తీర్చుకోవడానికి సమయం ఆసన్నమైంది వారికోసం పనిచేసి వారిని గెలిపించి నాయకులు గా తీర్చిది ద్దుతాం అందరూ పార్టీ సమావేశాలు తప్ప కుండా రావాలి. ఏఐసీసీ ఆదేశాలు మేరకు గ్రామ,మండల,బ్లాక్ కమిటీలు ఏర్పాటుకు అందరూ సహకరించాలి, కార్యకర్తలకు బాధ్యతలు,పదవులు ఇవ్వడమే మా లక్ష్యం, భూ భారతీ ద్వారా రైతుల సమస్యలు పరిష్కరిస్తున్నాము.
కెసిఆర్ డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పేరుతో కమిషన్లు తిన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం నియోజకవర్గానికి 3500 ఇళ్లు ఇస్తుంది. ఒక్కొక నియోజక వర్గానికి 10000 ఇల్లు ఇవ్వడానికి ప్రణాళిక సిద్ధంగా ఉందని అన్నారు. క్రమశిక్షణ కలిగిన వారికే పార్టీ పదవులు వస్తాయి ఈ విషయాన్ని ప్రతి ఒక్క కార్యకర్త గుర్తుంచు కోవాలని ఆయన సూచించారు.
జిల్లా ఇన్చార్జి పర్యవేక్షకులుగా రాజన్న సిరిసిల్ల జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్యనారా యణ గౌడ్, పర్యవేక్షకులు వేణుగోపాల్ యాదవ్ లు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం లో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంతరెడ్డి, మాజీ డిసిసిబి చైర్మన్ ఎడ్ల రాజిరెడ్డి, బద్దం ఇంద్రకరణ్ రెడ్డి, మాజీ సి డి సి చైర్మన్ కారంగుల అశోక్ రెడ్డి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు పండ్ల రాజు, కామారెడ్డి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గూడెం శ్రీనివాస్ రెడ్డి, పుట్నాల శ్రీనివాస్ యాదవ్, గోనె శ్రీనివాస్, పండ్ల అనిల్, ఐరేణి నరసయ్య,ఎన్ ఎస్ యు ఐ జిల్లా అధ్యక్షులు పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షులు సందీప్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అనుబంధ సంఘాల అధ్యక్షులు మండ లాల అధ్యక్షులు గ్రామ అధ్యక్షులు మాజీ జెడ్పిటిసి లు మాజీ ఎంపీటీసీలు సర్పంచులు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.