30-05-2025 01:08:56 AM
తెలంగాణ పోలీస్ శాఖ డైరెక్టర్ జనరల్ డాక్టర్ జితేందర్
కామారెడ్డి, మే 29 (విజయ క్రాంతి);, దేశంలోనే సాంకేతిక ను ఉపయోగించుకున్న దానిలో తెలంగాణ పోలీస్ శాఖ ప్రథమ స్థానంలో నిలిచిందని తెలంగాణ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డాక్టర్ జితేందర్ తెలిపారు.
గురువారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పోలీస్ కార్యాలయంలో జిల్లా పోలీస్ అధికారులతో ప్రత్యేక సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. అంతకుముందు జిల్లా పోలీస్ కార్యాలయం లో మొక్కను నాటారు. అనంతరం జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర జిల్లా పోలీస్ అధికారులు డిజిపి జితేందర్ రెడ్డి కి స్వాగతం పలికారు.
పోలీసు గౌరవ వందనం అందుకున్న ఆయన అనంతరం పోలీస్ అధికారులతో మాట్లాడారు. పోలీస్ అధికారులు బ్రతికేయస్ లో సమర్థవంతమైన నిష్పక్షపాతం దర్యాప్తు జరిపి బాధితులకు నాని న్యాయం జరిగేలా చర్యలు తీసుకున్నప్పుడే ప్రజల నమ్మకాన్ని పెంపొంది ంచవచ్చు అన్నారు.
రోడ్డు ప్రమాదాల నియంత్రణకైవే అథారిటీ రవాణా శాఖ వారితో సమన్వయం చేసుకుంటూ ప్రివెంటివ్ చర్యలు ట్రాఫిక్ నియమాలపై సైబర్ నేరాల పట్ల ప్రజలకు అవగాహన కార్యక్రమాలు చేపట్టడం ప్రశంసనీయమని కొనియాడారు. ఏదైనా నేరం జరిగాక చర్యలు తీసుకునే కంటే జరగాక ముందే జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
తరచూ ప్రాపర్టీ నేరాలకు పాల్పడేవారు పాత నేరస్థులే చోరీలకు పాల్పడుతున్నారని తెలిపారు. వారిపై గట్టి నిఘా పెంచాలని పోలీస్ అధికారులకు సూచించారు. తెలిపారు. డిజిపి డా. జితేందర్ ముందుగా పోలీసు గౌరవ వందనం స్వీకరించిన తర్వాత జిల్లాల పోలీసు కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటారు.
కామారెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా పోలీస్ అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ముందుగా జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, జిల్లాలో శాంతి భద్రతల నిర్వహణ, ప్రాధాన్యమైన కేసులు, నేరాల పరిశీలన, ప్రజలకు అందించిన సేవలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ ప్రజెంటేషన్ లో జిల్లాలో ఎదుర్కొంటున్న ప్రత్యేక సవాళ్లు, వాటి పరిష్కార మార్గాలు జిల్లా పోలీసులు ప్రదర్శించిన ప్రతిభలను ప్రస్తావించారు.
డీజీపీ ప్రతి సర్కిల్ ఇన్స్పెక్టర్, సబ్ డివిసనల్ అధికారులతో ప్రత్యేకంగా చర్చించి వారి ఏరియాలో జరుగతున్న నేరాలు ఎదుర్కొంటున్న సవాళ్లను ముఖ్యమైన కేసుల వివరాలు, వాటి పురోగతి నేరాల నివారణకు చేపట్టిన చర్యలు తెలుసుకున్నారు. ఈ సందర్బంగా డీజీపీ డాక్టర్ జితేంద్ర మాట్లాడుతూ... పోలీసు శాఖ యొక్క ప్రధాన లక్ష్యం ప్రజల్లో భద్రతాభావాన్ని పెంపొందించడం అని స్పష్టం చేశారు.
ప్రజలలో వారు సురక్షితంగా ఉన్నాము అన్న భావన కలిగేలా పోలీసింగ్ జరగాలని ఆయన సూచించారు. ప్రజల అభిప్రాయాలు, సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండటం ద్వారా వారి సమస్యలకు పరిష్కార మార్గాలు చూపడమే కాకుండా నేరాలుకూడా తగ్గించవచ్చు అని తెలిపారు.
ఈ సమీక్షా సమావేశంలో మల్టీ జోన్ ఐజి -1 చంద్రశేఖర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ గారు, జిల్లా ఎస్పి యం. రాజేష్ చంద్ర , నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, , కామారెడ్డి ఏఎస్పీ చైతన్య రెడ్డి , అదనపు ఎస్పీ అడ్మిన్ కే నరసింహారెడ్డి , డిఎస్పిలు శ్రీనివాస్ రావు , విఠల్ రెడ్డి , యాకూబ్ రెడ్డి, ఎస్బి ఇన్స్పెక్టర్,h సీఐలు, ఆర్ఐలు, ఎస్త్స్రలు, ఆర్ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.