14-05-2025 10:50:02 PM
నాగారం: పిల్లల బంగారు భవిష్యత్ వారి తల్లిదండ్రుల చేతిలో ఉందని నాగారం సర్కిల్ సీఐ రఘువీర్ రెడ్డి అన్నారు. బుధవారం రాత్రి సూర్యాపేట జిల్లా నాగారం మండలం ఫణిగిరి గ్రామంలో జిల్లా ఏస్పీ పెద్దపల్లి నరసింహ ఆదేశాల మేరకు 'ప్రజా భరోసా' కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారు పాల్గొని మాట్లాడారు. ఈ సందర్బంగా యువత గంజాయి, బెట్టింగ్స్ భారిన పడకుండా ఉండాలని అందుకు తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలన్నారు. అలాగే పలు చట్టాలపై అవగాహనా పెంచుకోవాలని, సోషల్ మీడియాకు దూరంగా ఉంటూ చదువులో పుస్తకాలపై ఆశక్తి పెంపొడించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ ఐలయ్య సిబ్బంది పాల్గొన్నారు.