04-09-2025 12:00:00 AM
కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాలచారి భరోసా
ఆదిలాబాద్, సెప్టెంబర్ 3 (విజయక్రాం తి): భారీ వర్షాల వల్ల నష్టపోయిన రైతుల ఏవరు ఆందోళన చెందవద్దని, ప్రభుత్వం అండగా ఉంటుందని కేంద్ర మాజీ మంత్రి వేణుగోపా ల్చారి అన్నారు. జిల్లాలో ఇటీవల కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆయన బుధవారం పర్యటించారు.
బోథ్ నియోజకవర్గంలోని తలమడుగు మండలంలో గల కజ్జర్ల, రుయ్యాడి గ్రామంలో దెబ్బ తిన్న పంట పొలాలను మాజీ జడ్పీటీసీ గోక గణేష్ రెడ్డి, బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ఆడే గజేందర్లతో కలిసి క్షేత్ర స్థాయి లో పరిశీలించి, నష్టపోయిన రైతులను కలిసి వారి పంట పొలాలను పరిశీలించి దైర్యం చెప్పారు. వరదల వల్ల దెబ్బతిన్న రోడ్లను పరిశీలించి సంబంధిత శాఖ అధికారాలతో మాట్లాడారు.
అనంతరం వేణుగోపాల్చారి మాట్లాడుతూ నష్టపోయిన రైతులు ఎవరు ఆందోళన చెందొద్దు అని భరోసా కల్పించారు. క్షేత్రస్థాయిలో పర్యటించి వ్యవసాయ అధికారులు పక్కగా నష్టపోయిన రైతుల వివరాలు నమోదు చేయాలని వ్యవసాయ అధికారులకు సూచించారు.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి దృష్టి కి నష్టం వివరాలు తీసుకెళ్లి, త్వరగా నష్టపరిహారం అందేవిదంగా, రోడ్ల మరమ్మతులు చేసే విధంగా చూస్తానని హామి ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు లోక ప్రవీణ్ రెడ్డి, సంతోష్, కృష్ణారెడ్డి, కమలాకర్ తో పాటు రైతులు, అధికారులు పాల్గొన్నారు.