30-07-2025 12:00:00 AM
ఎమ్మార్పీఎస్ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు గజ్జెల లక్ష్మణ్ మాదిగ
కరీంనగర్ క్రైం, జూలై 29 (విజయ క్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ఎమ్మార్పీఎస్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు గజ్జేల లక్ష్మణ్ మాదిగ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో దళితులకు ఇచ్చిన హామీలను అమలుపరచాలని కోరుతూ మంగళవారం జిల్లా కలెక్టర్ పమేల సత్పతికి వినతిపత్రం అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కోరు కమిటీ సభ్యులు ఎలుకపల్లి కుమార్, గన్నేరువరం మండల అధ్యక్షులు రాగటి వీరయ్య, కరీంనగర్ జిల్లా ఉపాధ్యక్షులుబొడ్డు నగేష్, కరీంనగర్ జి ల్లా సోషల్ మీడియా కన్వీనర్ దీకొండ రాజబాబు, కరీంనగర్ జిల్లా మహిళా అధ్యక్షురాలు ద మ్మగళ్ళ లతా, కేశవపట్నం మండల అధ్యక్షులు కనకం రాజయ్య, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ అరకిల్ల సాగర్, మాదిగ జిల్లా యూత్ అధ్యక్షులు దీకొండ కుమారస్వామి, తదితరులుపాల్గొన్నారు.