26-06-2025 01:15:27 AM
ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
పటాన్ చెరు, జూన్ 25 : రైతుల ఆర్థికాభివృద్దే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోందని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. ప్రతి రైతుకి రైతు భరోసాను ప్రభుత్వం వారి అకౌంట్లలో జమ చేసిందని అన్నారు. పటాన్ చెరు నియోజకవర్గ పరిధిలోని రైతులకు రైతు భరోసా నిధులు అందించడంలో కీలక పాత్ర పోషించిన పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు నరసింహారెడ్డి ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం క్యాంపు కార్యాలయంలో ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా నిధులు విడుదలకాగా పటాన్ చెరు నియోజకవర్గ పరిధిలోని రైతులకు నిధులు విడుదల కాకపోవడంతో వెంటనే స్పందించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో పాటు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దృష్టికి తీసుకుని వెళ్లి నిధులు విడుదల అయ్యేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.
రైతు భరోసా నిధులు విడుదల చేయడం పట్ల సీఎం రేవంత్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ ప్రభాకర్, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, డిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ శ్యామ్ రావు, సీనియర్ నాయకులు సంజీవరెడ్డి, శ్రీనివాస్, మల్లేష్ యాదవ్, మతిన్, మల్లేష్ యాదవ్, విఠల్ రెడ్డి, మాధవ రెడ్డి, బిక్షపతి యాదవ్, తదితరులు పాల్గొన్నారు.
ఆలయ నిర్మాణానికి రూ.1.5 లక్షల విరాళం
దేవాలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలని ఎమ్మెల్యే అన్నారు. నూతన దేవాలయాల నిర్మాణాలకు సంపూర్ణ సహకారం అందించడంతోపాటు పురాతన ఆలయాలను జీర్ణోధారణ చేస్తున్నామని తెలిపారు. భారతి నగర్ డివిజన్ పరిధిలోని ఈఎస్ఐ ఆసుపత్రి సమీపంలో నూతనంగా నిర్మిస్తున్న రామాలయం నిర్మాణానికి బుధవారం సాయంత్రం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆలయ కమిటీ ప్రతినిధులకు ఎమ్మెల్యే లక్షాయాబై వేల రూపాయల సొంత నిధులను విరాళంగా అందించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు నగేష్ యాదవ్, ఆలయ కమిటీ ప్రతినిధి భాస్కర్ రెడ్డి, తదితరులుపాల్గొన్నారు.