20-05-2025 12:00:00 AM
సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు పూసం సచిన్
ఆదిలాబాద్, మే 19 (విజయక్రాంతి) : స్వాతంత్ర సమర యోధుడు, దక్షిణ భారత కమ్యూనిస్ట్ ఉద్యమ నిర్మాత పుచ్చలపల్లి సుందరయ్య బాటలో నడిచి సమసమాజన్ని స్థాపిద్దామని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు పూసం సచిన్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రం లోని సీపీఎం కార్యాలయంలో కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య 40వ వర్ధంతి సభను నిర్వహించారు. ఈ సందర్బంగా పుచ్చలపల్లి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ మేరకు సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు పూసం సచిన్ మాట్లాడుతూ... సుందరయ్య కళాశాలలో చదివే సందర్భంలో గాంధీ పిలుపులో భాగంగా స్వాతం త్ర పోరాటంలో భాగస్వామ్యం అయ్యారని, అంటరాని తనానికి వ్యతిరేకంగా తన ఇంటి నుండే ఉద్యమాన్ని నడిపి కూలీ లకు సంఘాలు పెట్టి భూస్వాముల అరాచకాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు నిర్మించారని గుర్తు చేశారు.
సుందరయ్య నాయకత్వం లో నిజాం స్టేట్ లో దేశముఖ్ ల పీడనకు, వెట్టి చాకిరికి వ్యతిరేకంగా కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో ప్రజలు పోరాటానికి సన్నద్ధమయ్యారు. ఉదృతమైన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని కామ్రేడ్ సుందరయ్య పర్యవేక్షించడం జరిగిందన్నారు. 10 లక్షల ఎకరాల భూమిని దొరల కబంధహస్తాల నుంచి విడిపించి పేదలకు పంపిణీ చేసిన గొప్ప నాయకుడని కొనియాడారు.
దున్నే వానికే భూమి కావాలని పోరాటం కొనసాగించి, ఉత్తమ పార్లమెంటేరియన్ సుందర య్య ఉన్నాడని కొనియాడారు. సుందరయ్య కేవలం రాజకీయ నాయకుడు మాత్రమే కాదు, గొప్ప అధ్యయనశీలిగా ఉన్నాడని కొనియాడారు. ఈ కార్యక్రమం లో పార్టీ జిల్లా కమిటీ సభ్యురాలు మంజుల, నెళ్ల స్వామి, నాయకులు ఆశన్న, గంగారాం, అరిఫా, కొట్నాక్ సక్కు, గంగ సాగర్, రాధ తదితరులు పాల్గొన్నారు.