31-07-2025 01:00:36 AM
స్థానిక ఎన్నికల్లో లబ్ధి కోసమే కాంగ్రెస్ పాదయాత్ర
మాజీమంత్రి హరీశ్రావు విమర్శ
హైదరాబాద్, జూలై 30 (విజయక్రాంతి): స్థాని క ఎన్నికల్లో లబ్ధి కోసం మరోసారి పాదయాత్ర డ్రామాలు మొదలు పెడుతున్న కాంగ్రెస్ పార్టీ.. గురుకుల విద్యార్థులు చేస్తున్న పాదయాత్రల మీద ముందు దృష్టి సారించాలని మాజీ మంత్రి హరీశ్ రావు సూచించారు. గద్వాల్ జిల్లా అలంపూర్ చౌర స్తా నుంచి పాదయాత్రగా వెళ్లి జిల్లా కలెక్టర్కు విద్యార్థులు ఇవ్వాలనుకున్న ఫిర్యాదుకు తక్షణం పరిష్కా రం చూపించాలని ఆయన బుధవారం ఎక్స్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డిని ట్యాగ్ చేస్తూ విజ్ఞప్తి చేశారు.
రేవంత్రెడ్డి ఇప్పటికైనా కళ్లు తెరచి మీ పాలనలో రోజురోజుకీ పతనమవుతున్న గురుకుల వ్యవస్థను గాడిన పెట్టాలన్నా రు. ప్రశ్నించిన వారిపై, ప్రతిపక్షాలపై జులుం ప్రదర్శించే సీఎం తమ సమస్య లు పరిష్కరించాలంటూ పాదయాత్ర చేస్తున్న గురుకుల విద్యార్థులకు ఏమని సమాధానం చెబుతారని ఆయన ప్రశ్నించారు.
విద్యార్థుల గోస కనిపించడం లేదా?
పరిపాలన గాలికి వదిలేసి, అనునిత్యం రాజకీయాలు చేసే రేవంత్రెడ్డి కి, కాంగ్రెస్ పార్టీకి గురుకుల విద్యార్థు ల గోస కనిపించకపోవడం అమానవీయమని ఆయన విమర్శించారు. తరగ తి గదుల్లో ఉండాల్సిన భావి భారత విద్యార్థులను నడిరోడ్డు ఎక్కించిన దుర్మార్గ చరిత్ర ఈ కాంగ్రెస్ ప్రభుత్వానిదని మండిపడ్డారు. చదువుకోవాల్సి న పిల్లలను పట్టెడు అన్నం కోసం, తాగు నీళ్ల కోసం పాదయాత్ర లు చేసే దుస్థితి కల్పించిన కాంగ్రెస్ది అసమర్థ పాలన అని ధ్వజమెత్తారు.
‘వీ వాంట్ జస్టిస్’ అన్నందుకు పోలీసులను పెట్టి, బలవంతంగా డీసీఎంల లో విద్యార్థులను తరలించిన నీచమైన చరిత్ర ఈ ఇందిరమ్మ రాజ్యానిదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గురుకులాల్లో ఫుడ్ పాయిజన్లు, సమస్యల పై జాతీయ మానవ హక్కుల కమిషన్ నివేదిక అడిగినా ప్రభుత్వంలో చలనం కలుగదా అని హరీశ్రావు ప్రశ్నించారు.