3 July, 2026 | 8:32 PM

Breaking News

కస్తూర్బా గాంధీ విద్యార్థినీలకు ఏకరూప దుస్తులు, నోట్ బుక్స్ పంపిణీ   •   దేవ్ విజన్ సెంటర్ , ఆప్టికల్స్ ప్రారంభించిన సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా   •   సాధిక్ అలీ జయంతి సందర్భంగా శాంతినగర్ పాఠశాలకు డ్యూయల్ డెస్క్‌ల విరాళం   •   అధిక ఫీజుల దోపిడీని అరికట్టాలి: డీవైఎఫ్‌ఐ   •   డబుల్ బెడ్రూం ఇండ్ల లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ   •   ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనకు ఏర్పాట్లు పూర్తి   •   వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అప్రమత్తంగా ఉండాలి   •   గీతంలో పికిల్ బాల్ కోర్టులు ప్రారంభం   •   రాజు గోండుల కోటను దేశంలోనే ప్రముఖ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలి: కలెక్టర్ రాజర్షిషా   •   ప్రవీణ్ కుమార్‌పై మంత్రి వ్యాఖ్యలు సరికాదు   •  

మోదీ అబద్ధాలకు పరాకాష్ట

15-07-2024 01:03 AM

న్యూఢిల్లీ, జూలై 14 : గత నాలుగేళ్లలో ఎనిమిది కోట్ల ఉద్యోగాలు ఇ చ్చామని శనివారం ప్రధాని మోదీ చే సిన వ్యాఖ్యలను కాంగ్రెస్ జాతీయ అ ధ్యక్షుడు ఖర్గే ఖండించారు. ఓవైపు దేశంలో నిరుద్యోగం పెరిగిపోతుంటే.. వాస్తవాలను కప్పి పుచ్చు కునేందుకు మోదీ తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ఉద్యోగా ల కల్పన విషయంలో పచ్చి అబద్ధాలు మాట్లాడు తున్నారని ధ్వజమెత్తారు. “మీరు 2020 ఆగస్టులో ప్రారంభించిన నేషనల్ రిక్రూట్‌మెంట్ ఏజెన్సీ ద్వారా నాలుగేళ్లలో ఒక్క పరీక్ష కూడా ఎందు కు నిర్వహించలేదు. కేటాయించిన 1.517 కోట్ల నిధుల్లో కేవలం 58 కోట్లే ఎందుకు ఖర్చు చేశారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ హ క్కులను కాలరాయడానికి ఉద్దేశపూర్వకంగానే పనిచేయకుండా ఉంచారా” అని నిలదీశారు.