కస్తూర్బా గాంధీ విద్యార్థినీలకు ఏకరూప దుస్తులు, నోట్ బుక్స్ పంపిణీ
03-07-2026 08:31 PM
మండల విద్యాశాఖ అధికారి నాగేశ్వరరావు
బాన్సువాడ,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలోని కస్తూర్బా గాంధీ పాఠశాలలో శుక్రవారం విద్యార్థినులకు మండల విద్యాశాఖ అధికారి నాగేశ్వరరావు చేతుల మీదుగా ఏకరూప దుస్తులు,నోట్ బుక్స్ లను పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మండల విద్యాశాఖ అధికారి నాగేశ్వరరావు మాట్లాడుతూ... ప్రభుత్వం బాలికల విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, కేజీవీబీ ద్వారా గ్రామీణ ప్రాంత బాలికలకు నాణ్యమైన విద్య, వసతి, భోజన సౌకర్యాలతో పాటు అవసరమైన అన్ని సామాగ్రి ఉచితంగా అందిస్తోందని తెలిపారు. విద్యార్థినులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఉన్నత లక్ష్యాలను సాధించాలని పిలుపునిచ్చారు.






