17-02-2026 12:23:12 AM
పెబ్బేరు పిబ్రవరి 16: పెబ్బేరు పట్టణ కేంద్రంలోని పురపాలక సంఘం కార్యాలయాల్లో రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో ప్రత్యేక అధికారుల ఆధ్వర్యంలో సోమవారం నూతనంగా ఎన్నికై న కౌన్సిలర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా అదనపు కలెక్టర్ రెవె న్యూ ఖీమ్య నాయక్ ప్రత్యేక అధికారిగా వ్యవహరించి, 12 వార్డుల నూతన కౌన్సిలర్లతో ప్రమాణ స్వీకారం అనంతరం చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నికలను నిర్వహించారు.
సభ్యుల మద్దతుతో కాంగ్రెస్ కౌన్సిలర్ అక్కి శ్రీనివాస్ గౌడ్ చైర్పర్సన్గా, కౌన్సిలర్ సుమిత్ర ఎల్లారెడ్డి వైస్ చైర్పర్సన్గా ఎన్నికైనట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ కమిషనర్ ఖాజా అఫ్రోదీన్, తహసిల్దార్ మురళిగౌడ్, ఎస్ ఐ యుగేందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.