జగిత్యాలలో అస్తవ్యస్తంగా రోడ్లు
జగిత్యాల, ఏప్రిల్ 22 (విజయక్రాంతి): మిషన్ భగీరథ లైన్ లీకేజీలతో జగిత్యాల పట్టణంలోని వీధుల్లో వరద పారుతూనే ఉన్నది. నాడు పైప్లైన్ కోసం తవ్విన గుంతలను ఇప్పటికీ పూడ్చకపోవడం, అక్కడక్కడా సీసీరోడ్లు పెచ్చులు తేలడంతో ఆ ప్రాంతంలో ప్రయాణం ఇబ్బందికరంగా మారింది. వాహనదారులు ప్రతిరోజూ అవస్థలను ఎదుర్కొంటూ తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి మిషన్ భగీరథ గుంతలను పూడ్చివేయాలని, లీక్లను అరికట్టాలని, రహదారులకు మరమ్మతులు చేయాలని పట్టణవాసులు కోరుతున్నారు.