2 September, 2026 | 8:51 PM

Breaking News

పెరిక్స్ పై ఇన్కమ్ టాక్స్ రద్దుకు అంగీకరించిన యాజమాన్యం   •   రెవరెండ్ డాక్టర్ గుండెపాక వెంకన్నకు ది ఐకానిక్ ఇండియా అవార్డు   •   గంజాయి సాగుచేస్తున్న వ్యక్తిపై కేసు నమోదు   •   శేషగిరిరావును పరామర్శించిన జనసేన రాష్ట్ర నాయకులు డా గడల శ్రీనివాసరావు   •   నాలుగు క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం పట్టివేత   •   అక్రమ కేసులు ఎత్తివేయాలి: రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌. రామచందర్‌రావు   •   కాంగ్రెస్‌ 1000 రోజుల పాలనపై బీఆర్‌ఎస్‌ నిరసన   •   క్యాంప్ ఆఫీస్‌పై దాడి హేయమైన చర్య: ఎమ్మెల్యే కుంభం   •   మునిప‌ల్లి ఎస్సీ హాస్ట‌ల్‎ను త‌నిఖీ చేసిన చైర్మ‌న్, మండ‌ల ప్ర‌త్యేకాధికారి   •   పదవులు నా వెంట రావాలి.. భవిష్యత్ సీఎం నేనే!   •  

ఎస్‌ఎస్‌ఏ ఉద్యోగుల సమస్యలపై డీఈఓకు వినతి

15-05-2026 | 06:43pm

ఆసిఫాబాద్,(విజయక్రాంతి): సమగ్ర శిక్ష అభియాన్‌ (SSA) ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఉద్యోగుల సంఘం నాయకులు జిల్లా విద్యాశాఖ అధికారి లలితకు వినతిపత్రం సమర్పించారు. శుక్రవారం డీఈఓ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు ఆమెను కలిసి ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. అనంతరం పూల బొకే, శాలువాతో డీఈఓను సన్మానించారు. ఉద్యోగుల జీతాల పెంపు, ప్రతి నెల జీతాల చెల్లింపులో జరుగుతున్న ఆలస్యం, సమాచార లోపం కారణంగా రిపోర్టుల సమర్పణలో ఎదురవుతున్న ఇబ్బందులు తదితర అంశాలను వివరించారు. దీనిపై డీఈఓ లలిత సానుకూలంగా స్పందిస్తూ డీఈఓ స్థాయిలో పరిష్కరించగల సమస్యలను వెంటనే పరిశీలిస్తామని తెలిపారు. ఉద్యోగులకు ఏ సమస్య ఉన్నా నేరుగా తెలియజేయాలని సూచించారు.