17-01-2026 12:00:00 AM
చిట్యాల, జనవరి 16 : నకిరేకల్ నియోజకవర్గం యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఏనుగు రఘుమా రెడ్డి ఆధ్వర్యంలో కైట్ ఫెస్టివల్ కార్యక్రమం శుక్రవారం అత్యంత ఘనంగా నిర్వహించారు. చిట్యాల మండలం వెలిమినేడు గ్రామంలో నిర్వహించిన కైట్ ఫెస్టివల్ కార్యక్రమానికి వెలిమినేడు, పిట్టంపల్లి, బొంగోనిచెర్వు గ్రామాల నుండి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు,ప్రజా ప్రతినిధులు,యువజన కాంగ్రెస్ నాయకులు, వేముల అభిమానులు పెద్ద ఎత్తున హాజరై ఉత్సాహంగా పతంగులను ఎగరవేశారు.
ఈ సందర్భంగా ఏనుగు రఘుమా రెడ్డి మాట్లాడుతూ సంక్రాంతి పర్వదినాలు రైతుల పండుగలని, ప్రజలంతా ఐక్యంగా ఉండాలని, యువత సామాజిక, క్రీడ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలన్నారు. ఈ కార్యక్రమంలో పిట్టంపల్లి,బొంగోనిచెరువు గ్రామాల సర్పంచ్ లు అందె అండాలు-రాములు యాదవ్, కట్ట ఆశయ్య, వెలిమినేడు, బొంగోనిచెరువు కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు సుర్కంటి సత్తిరెడ్డి, కందాటి మహేందర్ రెడ్డి, పిట్టంపల్లి, బొంగోనిచెరువు గ్రామాల ఉప సర్పంచ్ లు నారగోని నాగరాజు యాదవ్, సామిడి సాయికృష్ణ రెడ్డి, పాల సంఘం చైర్మన్ మారగోని యాదయ్య పాల్గొన్నారు.