09-05-2025 12:34:19 AM
ఎమ్మెల్సీ దండే విఠల్
కుమ్రం భీం ఆసిఫాబాద్ మే8( విజయక్రాంతి): ఛత్రపతి శివాజీ మహారాజ్ చిరస్మరణీయుడని ఎమ్మెల్సీ దండే విఠల్ అన్నారు. గురువారం దాహేగాం మండలం ఐనం గ్రామంలో ఏర్పాటు చేసిన ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ ఆరె కులస్తుల సంక్షేమానికి కృషి చేయ డం జరుగుతుందన్నారు. రూ.25 లక్షలతో సంఘ భవనాల నిర్మాణాలకు నిధులు కేటాయించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్ర మంలో మాజీ జెడ్పీ చైర్మన్ సిడాం గణపతి, ఆరె సంక్షేమ సంఘం నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
కుమ్రం భీం పోస్టర్ల ఆవిష్కరణ
చింతలమానపల్లి మండలం డబ్బా చౌర స్తాలో ఏర్పాటుచేసిన కుమ్రం భీం విగ్రహావిష్కరణ పోస్టర్లను గురువారం ఎమ్మెల్సీ దం డే విఠల్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జల్ జంగల్ జమీన్ కోసం పోరాటం చేసిన మహాయోధుని స్ఫూర్తితో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
ఈనెల 12న నిర్వహించే విగ్రహ ఆవిష్కరణకు జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క హాజరవుతుందని మంత్రి పర్యటనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పి చైర్మన్ సిడాం గణపతి, నాయకులు నారాయణ ,నందనం ,సురేష్, రాజయ్య ,దినేష్ ,వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.