19-01-2026 12:00:00 AM
మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యే
ఎల్లారెడ్డి జనవరి 18 (విజయ క్రాంతి): ప్రమాదవశాత్తు తన పొలంలో మృతి చెందిన బోన్ల శ్రీనివాస్ కుటుంబీకులను ఎల్లారెడ్డి ఎమ్మెల్యే విషయం తెలియగానే నేరుగా వెళ్లి ఆయన కుటుంబీకులను కలిసి పరామర్శించారు. అనంతరం ఎమ్మెల్యే మదన్మోహన్ మాట్లాడుతూ మృతుడి కుటుంబీకులకు ప్రభుత్వం తరఫున అండదండలు ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.