30-10-2025 12:52:14 AM
-ప్రజలు కూడా యూనిఫామ్ లేని పోలీసులు
-అమరులైన పోలీసుల సేవలను గుర్తు చేసుకోవాలి
-నిమిషానికి రెండు డయల్ 100 ఫోన్ కాల్స్ అటెండ్
-రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు
-సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు
ఎల్బీనగర్, అక్టోబర్ 29 : ప్రజల రక్షణే పోలీసుల బాధ్యత అని, పోలీసులకు ప్రజలు సహకారం అందించాలని, మెరుగైన సమాజం కోసం ప్రజలు కూడా యూనిఫామ్ లేని పోలీసులేనని రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు అన్నారు. సరూర్ నగర్ స్టేడియంలో బుధవారం పోలీసు అమర వీరుల సంస్మరణ వారోత్సవాలు నిర్వహించారు. ఇందులో భాగంగా 2000 మందితో (విద్యార్థులు, కాలనీ వాసులు, తదితరులు) ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ, సుధీర్ సంద్ర, డాక్టర్ కవిత ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థుల్లో, ప్రజల్లో చైతన్యం నింపారు. వారోత్సవాల్లో మాట్లాడుతూ.. సమాజంలో ప్రజలకు సేవలందించి అమరులైన పోలీసుల సేవలను గుర్తు చేసుకునేందుకు పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో రాచకొండ పోలీసులు అందిస్తున్న సేవలు అభినందనీయ మని అన్నారు. రాచకొండ కమిషనరేట్ లో ప్రతి ఒక్క నిమిషానికి రెండు డయల్ 100 ఫోన్ కాల్స్ అటెంప్ట్ చేస్తున్నామని, రాత్రిపగలు ప్రజల కోసం పని చేస్తున్నారన్నారు.
పోలీసులు అన్ని రకాల సేవలను ఏక కాలంలో పనిచేసి ప్రజలకు ఆరు విభాగాలుగా ఏర్పడి విజుబుల్ పోలిసింగ్ లో భాగంగా సేవలు అందిస్తూ, ప్రజలకు ప్రత్యేక భద్రత కల్పిస్తున్నట్లు ఆయన గుర్తు చేశారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలోని పిల్లలకు దూరంగా ఉండే సీనియర్ సిటిజెన్స్ కి ఇంటింటికి వెళ్లి సహాయసహకారం అందిస్తున్నామని తెలిపారు. ఆపరేషన్ స్త్మ్రలీతో ప్రజలకు దగ్గర కావడం.. ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే మా లక్ష్యమని, దేశంలో రాచకొండ కమిషనరేట్ పరిధిలో అత్యధికంగా బాల కార్మికులను గుర్తించి వారికి బంగారు భవిష్యత్తు అందించామని గుర్తు చేశారు. ప్రజల కోసం విధులు నిర్వహించే పోలీసులకు ప్రజలు సహకారం అందించాలని పిలుపునిచ్చారు.
మెరుగైన సమాజం కోసం ప్రజలు కూడా యూనిఫామ్ లేని పోలీసులేనన్నారు. ప్రజలకు సేవలంధించే క్రమంలో పోలీసులు ప్రాణాలు కోల్పోతున్న సంగతి అందరికీ తెలిసిందేనని పేర్కొన్నారు. దేశంలో ఎన్ బీడబ్ల్యూ ఫ్రీ కమిషనరేట్ గా రాచకొండ కమిషనరేట్ నిలిచిందని ఆయన గుర్తు చేశారు. పోలీసుల సేవలను ప్రజలు గుర్తించాలని, ప్రజలకు అందించే సేవలను తెలియజేసేందుకు ప్రత్యేకంగా స్టాల్స్ ఏర్పాటు చేసి అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. ప్రజలకు ఫ్రెండ్లీ పోలీసింగ్ తోపా టు చట్ట వ్యతిరేకమైన చర్యలు చేసే వాళ్లను శిక్షించడంలో రాచకొండ పోలీసులు ఎపుడైనా ముందుంటుందని గుర్తు చేశారు. సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ్ మాట్లాడుతూ.. పోలీసులతో గానీ, ప్రతి ఒక్కరితో మనం కృతజ్ఞత కలిగి ఉండాలని సూచించా రు.
ఫ్రెండ్లీ పోలిసింగ్ ఉన్నట్లు మనం కూడా ప్రెండ్లీ సిటిజెన్ లాగా ఉండాలని, దేశం కో సం, మనం ఎంత ప్రశాంతంగా ఉంటున్నా మో దానికి కారణం పోలీసులేనని ప్రతి ఒ క్కరూ తెలుసుకోవాలన్నారు. అనంతరం కొ న్ని పాటల రూపంలో ప్రజలు ఎలా ఉండా లో తెలిపారు. సుధీర్ సంద్ర మాట్లాడుతూ.. సోషల్ మీడియాకు విద్యార్థులు ఎంత దూరం ఉండాలో, సమాజంలో ఎలా మెదలాలో సూచించారు.
పోలీసులు పడుతున్న కష్టాలని కళ్ళకి కట్టినట్లు చూ పించి పోలీసు ల పట్ల మర్యాదగా వ్యవహరించాలని, డ్రగ్స్, గంజాయి, ర్యాగింగ్ తదితర వాటిపట్ల అవగాహన కల్పించారు. కార్యక్రమంలో మల్కా జిగిరి డీసీపీ పద్మజ, ఎల్బీనగర్ డీసీపీ అనురాధ, యాదాద్రి భువనగిరి డీసీపీ ఆకాంక్ష్ యాదవ్, డీసీపీ క్రైమ్స్ అరవింద్ బాబు, డీసీపీ అడ్మిన్ ఇందిరా, డీసీపీ ఉమెన్ సేఫ్టీ ఉషారాణి, డీసీపీ మహేశ్వరం సునీతారెడ్డి, ఎస్బీ డీసీపీ నరసింహ రెడ్డి, డీసీపీ ఎస్వోటి రమణారెడ్డి, డీసీపీ ట్రాఫిక్ -1 శ్రీనివాస్, డీసీపీ ట్రాఫిక్ -2 శ్రీనివాసులు, సైబర్ క్రైమ్స్ డీసీపీ నాగలక్ష్మి, రోడ్ సేఫ్టీ డీసీపీ మనోహర్, డీసీపీ హెడ్ క్వార్టర్ శ్యామ్ సుందర్, అడిషనల్ డీసీపీలు, ఏసీపీలు పాల్గొన్నారు.