30-05-2025 12:00:00 AM
అదిలాబాద్, మే 29 (విజయక్రాంతి): జైనథ్ మండలంలోని తర్నం గ్రామ వాగుపై ఉన్న వంతెన విషయంలో జిల్లాలో రాజకీ యం రోజురోజుకు రాజుకుతుంది. గత మూ డేళ్ళ క్రితం పాత వంతెనకు బీటలు వారడం తో జైనథ్, బేలా మండలాలతో పాటు మహారాష్ట్రకు వెళ్లే ప్రజలకు వంతెనపై నుండి రాకపోకలు నిలిచిపోయాయి.
దీంతో అప్ప టి బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యంపై వివిధ రాజకీయ పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం జరిగింది. తాజాగా వాగుపై ఉన్న తాత్కాలిక వంతెనపై ఇటీవల వరద నీరు ఉధృతిగా ప్రవహిస్తున్న క్రమంలో దత్తు అనే యువకుడు వరద నీటిలో కొట్టుకుపోయి మృతి చెందడంతో మళ్ళీ తర్నం వంతెనపై చర్చ మొదలై మళ్ళీ రాజకీయం వేడెక్కింది.
తర్నం గ్రామంలోని సాత్నాల వాగుపై ఉన్న వంతెనే గత మూడేళ్ల క్రితం బీటలు వారింది. దీంతో వంతెన పైనుండి రాకపోక లు నిలిపివేసి తాత్కాలిక వంతెనను నిర్మించారు. అప్పుడు తెలంగాణ, మహారాష్ట్రలను కలిపే అంతర్ రాష్ట్ర రహదారిగా ఉన్న ఈ రహదారి గత ఏడాది క్రితం జాతీయ రహదారిగా మరి ఆర్ అండ్ బి నుండి నేషనల్ హైవే అథారిటీ పరిధిలోకి వెళ్ళింది.
అయితే తాత్కాలిక వంతెన రెండు సార్లు వర్షానికి కొట్టుకుపోవడంతో ఇటీవల జాతీయ రహదారిగా మారిన తరుణంలో ప్రజల రాక పోకలు సౌకర్యార్థం నూతన హైలెవెల్ వంతె న నిర్మాణానికి చర్యలు చేపట్టారు.
దీంతో కొన్ని రోజుల క్రితం పాత వంతెనను కూల్చివేసి అదే ప్రాంతంలో నూతన వంతెన నిర్మా ణానికి ప్రణాళిక రూపొందించారు. కాగా ప్రజల రాకపోకల కోసం రూ.4 కోట్లతో తాత్కాలిక వంతెనను నిర్మించారు. ప్రస్తుతం ఈ తాత్కాలిక వంతెన పై నుండి రాకపోకలు సాగుతున్నాయి.
యువకుడి మృతితో రాజకీయం..
గత మూడు రోజుల క్రితం తర్నం వాగు వరద నీరు ఉధృతిగా ప్రవహించడంతో తా త్కాలిక వంతెన పైనుంచి వెళ్తున్న దత్తు అనే యువకుడు వరద నీటిలో కొట్టుకుపోయా డు. గురువారం పుసాయి గ్రామ వాగులో మృతదేహం లభ్యమయ్యింది. అయితే యు వకుని మృతికి అధికార రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వలే కారణమని పలు రాజకీయ పార్టీల నేతలు ఆరోపిస్తున్నారు.
బ్రిడ్జికి బీటలు వారి మూడే ళ్లు గడిచిన అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం, అప్పుడు ఇప్పుడున్న కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం పట్టించుకోలేదని దీంతోనే ప్రజల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవడంతో పాటు ప్రజల ప్రాణాలు పోతు న్నా యని సీపీఐ జిల్లా కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లేష్ ఆరోపించారు. సీపీఎం సీనియర్ నేత లంకా రాగో లు తర్నం వాగులో యువకుడు గల్లంతైన ప్రాంతాన్ని పరిశీలించి, మృతుని కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
విచారణ జరిపించాలి: జోగు రామన్న
తర్నం వాగులో కొట్టుకుపోయాయి మృతి చెందిన లాండ్డే దత్తు మృతికి పూర్తి బాధ్యత ప్రభుత్వమే వహించాలని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. జిల్లా కలెక్టర్ను కలిసి వినతి పత్రం అందజేశారు. జిల్లాలో కురుస్తున్న వర్షాలతో తర్ణం బ్రిడ్జ్ వద్ద వాగు పొంగిపొర్లుతున్న సదరు కాంట్రాక్టర్, ప్రభుత్వ యంత్రాంగం బ్రిడ్జి వద్ద ఎలాంటి హెచ్చరికలు జారీ చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించి, లాండే దత్తు మృతికి కారకులయ్యారని ఆరోపించారు.
ఇది వరకు కాలినడకతో పాటు ద్విచక్ర వాహనాలు నడిచేందుకు వీలుగా ఉన్న పాత బ్రిడ్జును కాం ట్రాక్టర్ కూల్చి వేయడం సమంజసం కాదని, సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని జోగు రామన్న కలెక్టర్ను కలిసి వినతిపత్రం అందజేశారు.
మాజీ మంత్రి వ్యాఖ్యలను ఖండించిన ఎమ్మెల్యే పాయల్
తర్నం వాగులో యువకుడు దత్తు కొట్టుకుపోయి మృతి చెంద డం బాధాకరమని ఎమ్మెల్యే పాయల్ అన్నారు. మృతుని కుటుంబాన్ని ఆదుకునేలా తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అయితే ఈ ఘటనపై మాజీ మంత్రి జోగు రామన్న చేసిన వ్యాఖ్య లు అసత్యమన్నారు. బ్రిడ్జి నిర్మాణంలో కాంగ్రెస్, బిజెపి నేతలు కమిషన్ లకు ఆశపడ్డారని అందుచేతనే నిర్మాణం అలస్యంమైనద ని మాజీ మంత్రి వ్యాఖ్యలను ఎమ్మెల్యే తీవ్రంగా ఖండించారు.