24 June, 2026 | 2:04 PM

సత్తా చాటిన ‘పారా’లు

23-09-2024 12:00 AM

న్యూఢిల్లీ: ఇండోనేషియా వేదికగా జరుగుతున్న పారా బ్యాడ్మింటన్ ఇంటర్నేషనల్ పోటీల్లో భారత్‌కు చెందిన ఉమేష్ స్వర్ణం కైవసం చేసుకోగా... సుకాంత్, శివరాజన్, మన్‌దీప్ కౌర్ రజతాలు సొంతం చేసుకున్నారు. మొత్తం ఈ టోర్నీలో మన పారా షట్లర్లు 34 పతకాలతో సత్తా చాటారు.