18-06-2025 12:00:00 AM
డాక్టర్ ఊర రామ్మూర్తి యాదవ్
సూర్యాపేట జూన్ 17 (విజయక్రాంతి) : రైతుల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎనలేని కృషి చేస్తుందని ముమ్మాటికి కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి రైతుల పక్షపాతి అని ప్రముఖ డాక్టర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు వూర రామ్మూర్తి యాదవ్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి నివాసంలో ఏ ర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
దేశంలో కనివిని ఎరుగని రీతిలో రైతు భరోసా 9 వేల కోట్లను రైతుల ఖాతాలో 9 రోజుల్లో జమ చేయడం జరుగుతుందన్నారు. రాష్ట్రంలోని 70 లక్షల మంది రైతులకు కోటి 49 లక్షల ఎకరాల సాగుకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉందని తెలిపారు. రైతుల కోసం రైతు భరోసా, రైతు భీమా రుణమాఫీ, ఉచిత విద్యుత్ వంటి అనేక పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెడుతుందన్నారు.
గత ప్రభుత్వం రాష్ట్రాన్ని 8 లక్షల వేల కోట్ల అప్పుల ఊబి లోకి నెట్టిందని ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలన సాగిస్తూ ప్రజలను ఆదుకుంటుందని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో 20 వేల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదని ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 18 నెలల కాలంలో 50వేల ఉ ద్యోగాలను అందించిందని గుర్తు చేశారు. రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో విద్యా, వైద్యం కు పెద్దపీట వేస్తున్న సీఎం రేవంత్ రెడ్డికి ప్రజలంతా అండగా ఉంటారన్నారు.
సన్న బి య్యం పంపిణీతో కొత్త చరిత్రకు కాంగ్రెస్ ప్రభుత్వం పునాది వేసిందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి కారణంగా బీఆర్ఎస్ త్వరలో మరో పార్టీలో విలీనం కావడం ఖాయమన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు వెలుగు వెంకన్న, జ్యోతి కరుణాకర్, వల్డాసు దేవేందర్, ఫరూక్, నిమ్మల వెంకన్న, తండు శ్రీనివాస్ గౌడ్ బంటు చొక్కాయ్య, అంజయ్య, పిల్లల రమేష్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.