26-05-2025 01:45:19 AM
మహాదేవపూర్, (భూపాలపల్లి) మే 25 (విజయ క్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ కాటారం మధ్యలో ఘోర రోడ్డు ప్రమాదం ఎదురెదురుగా ఢీకొన్న రెండు కార్లు పలువురికి తీవ్ర గాయాలు. వెంటనే స్పందించిన స్థానికులు 108 ద్వారా మహదేవపూర్ సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలింపు.
ప్రథమ చికిత్స అనంతరం భూపాలపల్లి జిల్లా ఆస్పత్రికి తరలించారు. పూర్తి అధిక వేగమే ఈ ప్రమాదానికి కారణమని ఇసుక లారీలు నడవడం వల్ల జాతీయ రహదారిపై గాఢాలుగా గుంతలు ఏర్పడి కార్లు అదుపుతప్పి ఢీకొనడం జరిగిందని నస్రపల్లి స్థానికులు తెలిపారు.