22 April, 2026 | 1:37 PM

Breaking News

మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు మృతిపట్ల రేవంత్ రెడ్డి సంతాపం   •   ఆర్టీసీ సమ్మె వేళ... ప్రయాణికులకు మెట్రో గుడ్ న్యూస్   •   ఉప్పల్ బస్ డిపో ముందు ఆర్టీసీ కార్మికులతో తీన్మార్ మల్లన్న ధర్నా   •   మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు కన్నుమూత   •   కాళేశ్వరంపై నిందలు వేసి... కేసీఆర్ ప్రతిష్ట దెబ్బతీసేందుకు కుట్ర   •   కట్టుదిట్టమైన పర్యవేక్షణతో నాణ్యమైన రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలి   •   ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి   •   గంజి చంద్రమౌళి మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు   •   రేవంత్ రెడ్డి నిజస్వరూపం... హైకోర్టు తీర్పుతో తేటతెల్లం   •   పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి పొంగులేటి   •  

నాయకుల మాటతీరు మారాలి

22-11-2024 12:00 AM

మన దేశంలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో అధికార, ప్రతిపక్ష నాయకులు మాట్లాడే పద్ధతిని మార్చుకోవాలి. చాలామంది ఉపయోగించే భాష ఆందోళనకరంగా ఉంటున్నది. సభ్యసమాజంలో, ప్రజాస్వామ్య వ్యవస్థలో వాడకూడని పదాలు వాడడం పెద్దతనం అనిపించుకోదు. అధికార, ప్రతిపక్ష నాయకులు ఎవరైనా సరే విలేకరుల సమావేశాలు, ధర్నాలు, ర్యాలీలు, రాస్తారోకోలు, పాదయాత్రలు, ఊరేగింపులు, అభివృద్ధి, ఆందోళన కార్యక్రమాలలో వాడుతున్న భాష సభ్యసమాజం తల దించుకునేలా ఉంది.

‘నవ్వి పోదురుగాక నాకేటి సిగ్గు’ అన్న రీతిలో పలువురు వ్యవహరిస్తున్నారు. కొందరైతే మరీ దిగజారి మహిళలపై అనుచిత వ్యాఖ్యలూ చేస్తున్నారు. ఈ క్రమంలో పోలీసులు అలాంటి నాయకులపై చర్యలు తీసుకోవడానికి జంకుతున్నారు. దైర్యం చేసి కేసులు నమోదు చేసి దర్యాప్తు కొనసా గించాలనుకుంటే తమ పలుకుబడిని ఉపయోగించి కేసులు నమో దు కాకుండా చూసుకుంటున్నారు.

కేసులు నమోదైనా కోర్టులద్వారా బెయిల్ మంజూరు చేసుకుంటున్నారు. తర్వాత షరా మా మూలే. బూతు మాటలు మాట్లాడితేనే నాయకులమనే భ్రమలో వారంతా ఉండడం విచారకరం. ఇక, ఎన్నికల్లో ఓడిపోయిన వారు చేసిన తప్పులను సరిచేసుకోకుండా ప్రజలే తప్పు చేశారని, తమను గెలిపిస్తే సమస్యలే ఉండేవి కావని అనడం మరింత హాస్యాస్పదం.

ప్రజలు తమ పరిపాలనతోనే విసిగి కొత్త నాయకులను ఎన్నుకున్నారనే సత్యాన్ని వారు గుర్తించకపోతే ఎలా? క్షేత్రస్థాయిలో ప్రజల ను ఏనాడూ కలవని నాయకులు ఇప్పుడు ఏదో అన్యాయం జరిగిందని మొసలి కన్నీరు కార్చడం వల్ల ప్రయోజనం శూన్యం. సోష ల్ మీడియా వేదికగా అనుచిత వ్యాఖ్యలు క్షమార్హం కాదు.  

 డా. ఎస్. విజయభాస్కర్, హైదరాబాద్