19 March, 2026 | 1:28 PM

Breaking News

ఖతార్‌పై దాడి చేస్తే.. ఇరాన్‌లోని గ్యాస్‌ఫీల్డ్ మొత్తాన్ని పేల్చేస్తాం   •   మైదాన ప్రాంతాల్లో భారీ వర్షాలు.. ఎత్తైన ప్రాంతాల్లో మంచు   •   ఢిల్లీలోని వాణిజ్య, పన్నుల భవనంలో అగ్నిప్రమాదం   •   ఇలా అయితే పండుగ ఎలా..?   •   దేశంలో ఉండాలంటే.. వందేమాతరం ఆలపించాల్సిందే.. ఒవైసీ కళాశాలల్లో ఉగ్రమూలాలు   •   బీఆర్ఎస్ పార్టీకి షాకిచ్చిన సర్పంచులు   •   కరాచీలో వర్షం బీభత్సం: 19 మంది మృతి.. ఎమర్జెన్సీ ప్రకటించిన మేయర్   •   తెలంగాణ ప్రజలకు కేసీఆర్ ఉగాది శుభాకాంక్షలు   •   ‘తెలంగాణ ప్రజా జాగృతి’ పేరుతో కవిత కొత్త పార్టీ   •   శ్రీరామనవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలకు సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం   •  

దేశ ఆర్థికాభివృద్ధిలో సీఏల పాత్ర కీలకం

07-07-2024 12:04 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 6 (విజయక్రాంతి): దేశ ఆర్థికాభివృద్ధిలో సీఏలది కీలక పాత్ర అని హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ ఎన్‌వీఎస్ రెడ్డి అన్నారు. శనివారం నగరంలోని ఓ హోటల్‌లో జరిగిన సీఏ డే వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ సహా ఇతర సాంకేతికతను ఉపయోగించి దేశంలోని ప్రధాన నగరాలను గ్లోబల్ అకౌంట్స్ ప్రాసెసింగ్ హబ్‌లుగా మార్చాలని సూచించారు. ఉన్నతమైన ప్రమాణాలు, కఠినమైన ఆడిటింగ్ పద్ధతులను అవలంభించడం వల్ల అవినీతి, మోసాలను నిరోధించ వచ్చని తెలిపారు. హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టులో సాధించిన ఇంజినీరింగ్, ఆర్థికంగా సాధించిన ప్రగతిని వివరించారు. ప్రపంచస్థాయి అకౌంటింగ్ సంస్థలను సృష్టించాలని సూచించారు. కార్యక్రమంలో ప్రాంతీయ పాస్‌పోర్ట్ అధికారి, సీఏ జే స్నేహజ, సీఏ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు దేవరాజ రెడ్డి, సీఏ విజయ్‌కుమార్, సీఏ లక్ష్మిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.