16-07-2025 07:56:29 AM
తిరుమల తిరుపతి దేవస్థానంలో(Tirumala Tirupati Devasthanam) భక్తుల రద్దీ కొనసాగుతుంది. తిరుమలలో టోకేన్ లేని భక్తుల సర్వదర్శనానికి(Srivari Sarva Darshan) 24 గంటల సమయం పడుతోందని ఆలయ అధికారులు ప్రకటించారు. 73,020 మంది భక్తులు నిన్న తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. 27,609 మంది భక్తులు నిన్న తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.19 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు బుధవారం వెల్లడించారు.