23-06-2025 01:06:40 AM
మురళీ కృష్ణంరాజు, శ్రుతిశెట్టి జంటగా నటిస్తున్న సినిమా ‘స్కై’. వేలార్ ఎంటర్టైన్మెంట్ స్టూడియోస్ బ్యానర్పై నాగిరెడ్డి గుంటక, పృథ్వీ పెరిచెర్ల, శ్రీలక్ష్మీ గుంటక, మురళీకృష్ణంరాజు నిర్మిస్తున్నారు. పృథ్వీ పెరిచెర్ల దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలో రిలీజ్ కానున్న ఈ సినిమా నుంచి ‘తపనే తెలుపగ..’ అనే పాటను మేకర్స్ శనివారం విడుదల చేశారు. ఈ పాటకు పృథ్వీ పెరిచెర్ల లిరిక్స్ అందించగా వైష్ణవి పాడారు.
మ్యూజిక్ డైరెక్టర్ శివ ప్రసాద్ మెలోడీ ట్యూన్తో కంపోజ్ చేశారు. ‘తపనే తెలుపగ పలుకే.. ఉసురే నిలిపెను పిలుపే.. మనవే వినగా మనసే.. మదినే గుడిలా మలిచే.. అలసిన సమయం జతగా.. అనుమతి అడగక రావా.. కురిసెను విరహం కనులా.. రగిలిన హృదయపు సడిలో..’ అంటూ సాగుతోందీ పాట.
హీరోహీరోయిన్స్ మురళీ కృష్ణంరాజు, శ్రుతిశెట్టిపై ఆహ్లాదకరమైన లొకేషన్స్లో ఈ పాటను చిత్రీకరించారు. ఆనంద్ భారతి, రాకేశ్ మాస్టర్, ఎంఎస్, కేఎల్కే మణి బమ్మ ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి డీవోపీ: రసూల్ ఎల్లోర్; ఎడిటర్: సురేశ్ ఆర్స్.