23-06-2025 01:08:04 AM
ప్రిన్స్, సుహానా ముద్వాన్ హీరోహీరోయిన్లుగా ఓ కొత్త సినిమా తెరకెక్కుతోంది. కుమార్ రవి కంటి దర్శకత్వం వహిస్తూ లైట్ స్టోర్మ్ సెల్యూలాయిడ్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. ఇందులో సునయన, నెల్లూరు సుదర్శన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. సతీశ్ సారెపల్లి, శ్రీమణి ఇతర పాత్రలు పోషించనున్నారు. ఈ సినిమా ఆదివారం హైదరాబాద్లో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.
ముహూర్తపు సన్నివేశానికి బేబి దియా రవి కంటి క్లాప్ కొట్టగా, సుమ రవి కంటి కెమెరా స్విచ్ ఆన్ చేశారు. బేబి మాయ రవి కంటి తొలి దర్శకత్వం వహించారు. పలువురు సినీప్రముఖులు హాజరై చిత్రబృందానికి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా కుమార్ రవి కంటి మాట్లాడుతూ.. “ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాం.
హాస్యం, హృదయాన్ని హత్తుకునే భావోద్వేగాల కలయికగా ఈ సినిమా రూపుదిద్దుకోనుంది. జూన్, జూలై, ఆగస్టు మాసాల్లో నిర్విరామంగా ఈ సినిమా షూటింగ్ నిర్వహించనున్నాం. పాటలను విదేశాల్లో చిత్రీకరిస్తాం” అని తెలిపారు. ఈ చిత్రానికి మాటలు: భవాని ప్రసాద్; కెమెరా: జీ అమర్.