calender_icon.png 16 December, 2025 | 3:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కన్నెగుండ్ల ఆంజనేయులు సేవలు మరువలేనివి

13-12-2025 12:00:00 AM

గరిడేపల్లి, డిసెంబర్ 12 :  మండల పరిధిలోనీ సర్వారం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు,మార్కెట్ కమిటీ మాజీ ఉపాధ్యక్షులు, జిల్లా కాంగ్రెస్ పార్టీ మాజీ ఉపాధ్యక్షులు కన్నెగుండ్ల ఆంజనేయులు సేవలు మరువలేనివని కాంగ్రెస్ పార్టీ మాజీ సర్పంచ్ సాముల వెంకట్ రెడ్డి అన్నారు. మండలంలోని సర్వారం గ్రామంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం సర్వారం బస్‌స్టాండ్ సెంటర్లో ఆంజనేయులు చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు.

ఈ సందర్భంగా పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ కన్నె గుండ్ల ఆంజనేయులు కాంగ్రెస్ పార్టీ కోసం చేసిన సేవలను కొనియాడారు. కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీ కార్యకర్తలకు అండగా ఉన్న మహానీయుడని గుర్తు చేసుకున్నారు.

ఆయన ఆశయ సాధన కోసం పనిచేయాలని కోరారు.పలువురు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మహిళ అభ్యర్థి మైల కళావతి సీతయ్య, మాజీ ఉప సర్పంచ్ సోమిరెడ్డి రామిరెడ్డి, శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీ బారెడ్డిశ్రీనివాస్ రెడ్డి, సాముల కోటిరెడ్డి, దొంత గాని మట్టపల్లి, పెండెం కోటేశ్వరరావు, కర్నాటి సత్యనారాయణ రెడ్డి, రాములు, అంజయ్య, గోపయ్య, భీమపంగు శ్రీనివాసు వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.