ఆర్థిక సహాయం అందజేత..
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు నారబోయిన రవి ముదిరాజ్..
మునుగోడు (విజయక్రాంతి): మండలంలోని చీకటి మామిడి గ్రామానికి చెందిన సత్తు రాములు ముదిరాజ్(55) శుక్రవారం ఆకస్మికంగా ఆనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు నారబోయిన రవి ముదిరాజ్(Congress Party State Leaders Naraboina Ravi Mudhiraj) వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేసి తన వంతుగా 20,000 రూపాయల ఆర్థిక సహాయం పంపించగా ముదిరాజ్ సంగం మునుగోడు నియోజకవర్గ అధ్యక్షుడు జెట్టి గణేష్, సంఘం మండల అధ్యక్షులు సుర శంకర్ ముదిరాజ్ వారి కుటుంబ సభ్యులకు అందజేశారు.
ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం మండల ప్రధాన కార్యదర్శి పండుగ అశోక్ ముదిరాజ్, చీకటి మామిడి గ్రామ ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు భయ్యా శంకర్, సుర ఆంజనేయులు, సత్తు చంద్రయ్య, సత్తు అంజయ్య, ఏరుకొండ అంజయ్య, వనం సత్తయ్య, వనం ఎంకన్న, మేకల రాజు, పులకరం ఆంజనేయులు, పులకర నరసింహ సత్తు లింగస్వామి, పులకర శ్రీరాములు ఉన్నారు.






