ఆర్థిక సంక్షోభం దిశగా రాష్ట్రం
25-03-2026 12:34 AM
మండలిలో ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి
హైదరాబాద్, మార్చి 24 (విజయక్రాంతి): రాష్ట్రం ఆర్థిక సంక్షోభం దిశగా వెళ్తోందని టీచర్ ఎమ్మెల్సీ పింగలి శ్రీపాల్ రెడ్డి ఆరోపించారు. శాసనమండలిలో బడ్జెట్పై ఆయన మాట్లాడుతూ.. ఎఫ్ఆర్బీఎం పరిమితికి మించి రాష్ట్రం అప్పులు చేస్తోందని, రూ.8 లక్షల కోట్లకు అప్పు చేరిందన్నారు.
భూముల అమ్మకంపై ఆధారపడకుండా ఆదాయాన్ని పెంచుకునేలా ప్రణాళికలుండాలని, ఆర్థిక క్రమశిక్షణ అవసరమన్నారు. గత బడ్జెట్కు ఈ బడ్జెట్ మధ్య తేడా లేదన్నారు. రాష్ట్రంలో తెలంగాణ పబ్లిక్ స్కూళ్ల పేరుతో పాఠశాలలు మూసివేసే ప్రయత్నం జరుగుతుందని పేర్కొన్నారు. పీఆర్సీ నివేదిక సిద్ధంగా ఉందని, దాన్ని తెప్పించుకుని ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని కోరారు.




