calender_icon.png 24 June, 2025 | 6:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థి ‘బడి’కి.. రైతన్న సాగు‘బడి’కి..

12-06-2025 12:00:00 AM

  1. జూన్ వచ్చిందంటే తల్లిదండ్రులకు తీరని గుబులు
  2. ముంచుకొస్తున్న ముహూర్తం పరిశీలిస్తే సౌరూప్యం
  3. పెరిగిన పెట్టుబడులతో ఆందోళన

ఇల్లెందు, జూన్ 11 (విజయక్రాంతి): జూన్ మాసం తల్లిదండ్రుల్లో తీవ్ర గుబులను రేపుతోంది.. ఒకవైపు పాఠశాలలు ప్రారంభం, మరోవైపు వ్యవసాయ పనులకు శ్రీకా రం దీంతో ఆర్థికపరమైన భయాందోళన తల్లిదండ్రుల్లో మొదలవుతుంది. ‘బడి’ విద్యార్థులు చదువుకునే ప్రదేశం.. ‘మడి’ రైతు సాగు చేసే క్షేత్రం.. ఈ రెండింటి కీ ఆరంభం ఈ జూన్ మాసమే.. ఈ నెల వచ్చిందంటే చాలు విద్యార్థులు బడికెళ్లేందుకు సిద్ధమవుతూ, అటు రైతులు సాగుబడికి స న్నద్ధమవుతుంటారు.

అనేక విషయాల్లో ’విద్యకు.. ’సేద్యా నికి’ ఆరంభ సమయంలో ద గ్గర సంబంధం ఉంటుంది. ఇప్పుడు అన్నదాతకు అవసరమైన ఎరువులు, విత్తనాలు, దుక్కి దున్నేం దుకు ట్రాక్టర్ల అద్దె.. ఇలా అవసరమైన అన్ని వస్తువులకు పెట్టుబడులు పెరిగిపోతున్నా యి. విద్యకు సంబంధించి పుస్తకాలు, ఫీజులు, వసతి గృహాలకు చెల్లించాల్సి న డబ్బులు అధికమయ్యాయి. రైతులకు నకి లీ విత్తనాల భయమున్నట్లే.. విద్యార్థులకు కూడా గుర్తింపు లేని పాఠశాలల భయం పొంచి ఉంది.

‘బడికి.. మడికి’ సంబంధించి న కొన్ని విషయాలను పరిశీలిస్తే సౌరూప్యం ఇలా.. ఈ సౌరూప్యంపై ’విజయక్రాంతి’ ప్ర త్యేక కథనం.. పుస్తకాలు సర్దుకుంటూ.. పలుగుకు పదును పెడుతూ..వర్షాలు తరచు కు రు స్తుండటంతో  రైతులు పలుగు, పారలకు పదును పెడుతున్నారు. అరకలు సర్దుకుంటున్నారు. దుక్కులు దున్ని విత్తనం విత్తేందుకు సిద్దమవుతున్నారు.

ఉమ్మడి జిల్లాలో ఏ గ్రా మానికి వెళ్లినా రైతుల ఇళ్లలో వ్య వసాయ సందడి కనిపిస్తుంది. దుక్కులు దున్నించేందుకు ట్రాక్టర్లు ఉన్న వారి ఇంటికి తిరిగి తమ దుక్కి దున్నాలంటూ వేడుకుంటున్నారు. ఇక విద్యార్థులకు బడులు ప్రారం భం వారం రోజులే ఉండటంతో దీనితో గత రెండు నెలలుగా మూలన పడేసిన తమ బ్యాగులు, పుస్తకాలకు బూజులు దులుపుతున్నారు. సెలవు వచ్చిందంటే తల్లిదండ్రులు ఇంట్లో అదే పనిగా కనిపిస్తుంటారు.

అరకకు పూజా.. పలకపై అక్షరాభ్యాసం..

ఏరువాక ప్రారంభించే సమయంలో ప్ర తిరైతు అరకకు పూజ చేస్తారు. అదే రీతిలో పిల్లలకు పలకపై దైవ సన్నిధిలో అక్షరాభ్యాస పూజలు చేయిస్తారు. మొదట ఉగాది పం డుగ రోజునే రైతులు పూజలు చేసినా విత్త నం విత్తే సమయంలో పొలంలో పూజలు చే యడం ఆనవాయితీ. పాఠశాలలు ప్రారం భం అయ్యాక ప్రస్తుతం పాఠశాలల్లో కూడా తల్లిదండ్రులు పట్టించుకోక పోయినా సా మూహిక అక్షరాభ్యాస కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. ఇలా రెండు పనుల్లో పూజలు తప్పక చేస్తారు.

రైతులకు ఎరువులు.. విద్యార్థికి పుస్తకాలు..

జూన్ నెల వచ్చిందంటే ఎరువులు, విత్తనాల దుకాణదారులకు పండిందే పంట. ఉమ్మడి జిల్లాలో ఖరీఫ్ పంటలకు పెట్టుబడుల కోసం రూ.కోట్లలో ఖర్చు చేస్తారు. ఒక్క ఎరువులే నాలుగైదు లక్షల టన్నుల వరకు అవసరం ఉంటుంది. విత్తనాలు కూడా లక్ష టన్నులకు పైగా అవసరం ఉంటుంది.

ఇవ న్నీ రైతులు వ్యాపారుల వద్దే కొనుగోలు చే సుకోవాల్సి ఉంటుంది. వ్యాపారులను ఆశ్రయించ వద్దనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రై తులకు ఎకారకు ’రైతుభరోసా ’ పథకంతో రూ. ఆరు వేల పెట్టుబడిని ఉచితంగా అందిస్తున్నారు. బడులు ప్రారంభించడంతో పుస్త కాల దుకాణాలు, దుస్తుల కోసం రెడీమేడ్ దుస్తుల కోసం, షూమార్టులు కిటకిటలాడుతున్నాయి.

వీటిలో కూడా రూ. లక్షల్లో వ్యా పారం సాగుతుంది. పట్టణాలు, మండల కేంద్రాలు అనే తేడా లేకుండా కొనుగోలు జరుగుతుంది. ఇక్కడ ప్రభుత్వ పాఠశాలల్లో ఉచితంగా పాఠ్యపుస్తకాలు, దుస్తులు, ఇతర త్రా ఉచితంగానే అందిస్తున్నారు.

మేఘాలు కరుణిస్తే పంట.. సరస్వతి కటాక్షిస్తే విద్య..

అన్నదాత బాగుంటేనే అందరికీ పట్టెడ న్నం దొరుకుతుంది. అందుకే రైతే దేశానికి వెన్నుముక అంటారు. చక్కని పంటలు పం డించే రైతుకు కాలం కలిసి రావాలని అంద రూ కోరుతుంటారు. మేఘాలు సకాలంలో కరుణిస్తేనే వర్షాలు కురిసేది. రైతుల ఇంట సిరుల పంటలు -పండేది.

మనం అందరం వానదేవున్ని వేడుకుందాం. ఇక నేటి బాలలే రేపటి పౌరులనే సామెత అందరికీ గుర్తుంటుంది. చక్కని బోధన అందాలంటే, మంచి ఫలితాలు రావాలంటే ఉత్తీర్ణత శాతం పెరగాలంటే దేవుడి కటాక్షం అవసరం ఉంటుంది. అందుకోసం అందరూ వివిధ రీతుల్లో భగవంతున్ని పూజిస్తారు.

విత్తనం తీరు పంట.. బోధనను బట్టి ఫలితం..

రైతు విత్తనం ఎంపిక విషయంలో తగు జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంటుం ది. గుర్తింపు పొందిన విత్తన కంపెనీల రకాలనే కొనుగోలు చేసుకోవాలి. సకాలంలోఎ రువులు చల్లుకోవాలి. ప్రకృతి కూడా కరునించాలి. ఒక వేల కాలం కలిసొచ్చినా విత్త నాలు నకిలీవైతే దిగుబడులపై ప్రభావం ప డుతుందనేది గుర్తించాలి. ఇదే రీతిలో వి ద్యార్థులకు మంచి విద్య అందాలంటే మంచి పా ఠశాలల్లోనే చేర్పించాలి.

అవి ’గుర్తింపు’ ఉన్న వా.. లేవా.. అనేది పరిశీలించుకోవాలి. పాఠశాల ఎంపిక విషయంలో జాగ్రత్త లేకుం టే పిల్లలకు కూడా బోధన అందడం కష్టం. ఫలితాలు కూడా అనువుగా రావనేవి గుర్తించా లి. అన్నీ అయ్యాక బాధ పడేకంటే రైతుకాని, విద్యార్థి కాని తగు జాగ్రత్తలు పాటించాలి.