04-02-2026 12:00:00 AM
క్యాబినెట్ నిర్ణయానికి అనుగుణంగా గవర్నర్ నిర్ణయం తీసుకోవచ్చన్న ధర్మాసనం
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 3 : గవర్నర్ కోటా ఎమ్మెల్సీల ఎంపిక విషయంలో సుప్రీంకోర్టు స్పష్టత ఇచ్చింది. ఎమ్మెల్సీల ఎంపికకు అడ్డంకిగా తమ ఉత్తర్వులు లేవని తేల్చి చెప్పింది. క్యాబినెట్ నిర్ణయానికి అనుగుణంగా గవర్నర్ నిర్ణయం తీసుకోవచ్చని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. తన ఎన్నికపై జారీ చేసిన ఉత్తర్వులు ఎత్తేయాలని అమీర్ ఆలీ వెకేట్ పిటీషన్ వేశారు. అలీ వేసిన పిటిషన్ను బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ వేసిన ప్రధాన పిటీషన్తో జత చేస్తూ కోర్టు ఆదేశాలు ఇచ్చింది.