calender_icon.png 24 October, 2025 | 5:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లక్ష కోట్ల పెట్టుబడులే లక్ష్యం

24-10-2025 12:49:08 AM

  1. లైఫ్ సెన్సైస్‌లో 5 లక్షల మందికి ఉపాధి
  2.   2030 నాటికి కల్పించేలా రోడ్ మ్యాప్
  3. త్వరలోనే అందుబాటులోకి కాంప్రహెన్సివ్ లైఫ్ సెన్సైస్ పాలసీ
  4. బయో-డిజిటల్ యుగానికి అనుగుణంగా రెడీ టు వర్క్ ఫోర్స్
  5. తెలంగాణ అంటే భవిష్యత్తు.. అవకాశాల ఖని
  6. ఆస్‌బయోటెక్ సదస్సులో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు

హైదరాబాద్, అక్టోబర్ 23 (విజయక్రాంతి): లైఫ్ సెన్సైస్‌లో 2030 నాటికి కొత్తగా రూ.లక్ష కోట్ల పెట్టుబడులను రాష్ట్రానికి తీసుకొచ్చి 5 లక్షల మందికి ఉపాధి కల్పించేలా రోడ్ మ్యాప్ సిద్ధం చేస్తున్నట్టు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. ఆస్ట్రేలియా లైఫ్ సెన్సైస్ అత్యున్నత నిర్ణాయక సంస్థ ‘ఆస్‌బయోటెక్’, విక్టోరియా రాష్ర్ట ప్రభుత్వం సంయుక్త నిర్వహణలో మెల్ బోర్న్‌లో నిర్వహిస్తున్న ‘ఆస్‌బయోటెక్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ 2025’లో ఆయ న గురువారం కీలకోపన్యాసం చేశారు.

రెండేళ్లలో తెలంగాణ లైఫ్ సెన్సైస్ రంగం సాధించిన పురోగతి, భవిష్యత్తు ప్రణాళికలు, అవకాశాలు, ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అనుకూలతలను వివరించారు. తెలంగాణను ‘గ్లోబల్ లైఫ్ సెన్సై స్ హబ్’గా మార్చేందుకు రాష్ర్ట ప్రభుత్వం తరఫున తీసుకుంటున్న చర్యలను వెల్లడించారు. భౌగోళికంగా 11వ స్థానం, జనాభా లో 12వ స్థానంలో ఉన్నప్పటికీ, దేశ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో తెలంగాణ వాటా 5 శాతం కంటే ఎక్కువగా ఉందని తెలిపారు.

2024-25లో తెలంగాణ జీఎస్‌డీపీ వృద్ధి రేటు 8.2 శాతం కాగా, జాతీ య సగటు 7.6 శాతం మాత్రమే ఉందని చెప్పారు. గత 20 నెలల కాలంలో కొత్తగా రూ.3.2 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి రాగా, ఇందులో లైఫ్ సెన్సైస్ రంగం వాటా రూ.63 వేల కోట్లు అని వెల్లడించారు.

లైఫ్ సెన్సైస్ ఎగుమతులు గతేడాది ఏప్రిల్- డిసెంబర్ మధ్య కాలంలోనే రూ.26 వేల కోట్ల మార్కును దాటాయన్నారు. తెలంగాణ లైఫ్ సెన్సైస్ రంగం ఆర్థిక వ్యవస్థ విలువను ప్రస్తుతం ఉన్న 80 బిలియన్ డాలర్ల నుంచి 2030 నాటికి 250 బిలియన్ డాలర్లకు చేర్చాలని లక్ష్యం గా పెట్టుకున్నామని వివరించారు. ఇందుకోసం త్వరలోనే ‘కాంప్రహెన్సివ్ లైఫ్ సెన్సైస్ పాలసీ’ని అందుబాటులోకి తెస్తామని చెప్పారు. 

భారత్ నుంచి హైదరాబాద్ మాత్రమే.. 

ప్రముఖ కన్సల్టింగ్ సంస్థ సీబీఆర్‌ఈ రూపొందించిన ‘గ్లోబల్ లైఫ్ సెన్సైస్ అట్లాస్ 2025’లో ప్రపంచంలోని అత్యుత్తమ లైఫ్ సెన్సైస్ క్లస్టర్లలో హైదరాబాద్‌కు చోటు దక్కిందని మంత్రి శ్రీధర్‌బాబు చెప్పారు. బోస్టన్, శాన్ ఫ్రాన్సిస్కో, కేంబ్రి డ్జ్, బీజింగ్, టోక్యో సరసన హైదరాబాద్ నిలిచిందని తెలిపారు. ఈ జాబితాలో భార త్ నుంచి చోటు దక్కించుకున్న ఏకైక నగ రం హైదరాబాద్ మాత్రమే అని అన్నారు.

లైఫ్ సెన్సైస్ ఆఫీస్ లీజింగ్ 2022లో 0.6 మిలియన్ చదరపు అడుగులు ఉండగా.. 2024లో ఏకంగా నాలుగు రెట్లు పెరిగి 2.4 మిలియన్ చదరపు అడుగులకు చేరిందని వివరించారు. లైఫ్ సెన్సైస్ వర్సిటీ, యంగ్ ఇండియా స్కిల్స్ వర్సిటీ, వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్, సెంటర్ ఫర్ ది ఫోర్త్ ఇండస్ట్రియల్ రివల్యూషన్, ఇతర అంతర్జాతీయ దిగ్గజ సంస్థల భాగస్వామ్యంతో రాబోయే ‘బయో-డిజిటల్’ యుగానికి కావాల్సిన అత్యుత్తమ నైపుణ్యమున్న మానవ వనరులను తయారు చేసే బాధ్యతను రాష్ర్ట ప్రభుత్వం తీసుకుందన్నారు. 

మా నినాదం ఇన్వెంట్ ఇన్ తెలంగాణ 

తమ నినాదం మేడిన్ ఇండియా కా దు.. ఇన్వెంట్ ఇన్ తెలంగాణ అని మంత్రి శ్రీధర్‌బాబు స్పష్టంచేశారు. లైఫ్ సెన్సైస్ పరిశ్రమల ఏర్పాటుకు అనువైన ‘ఎకో సిస్టం’ తెలంగాణ బ్రాండ్‌ను విశ్వవ్యాప్తం చేస్తుందన్నారు. జీనోమ్ వ్యాలీ, మెడికల్ డివైసెస్ పార్క్, బీ హబ్, భారత్ ఫ్యూచర్ సిటీ, పారిశ్రామికాభివృద్ధిని ప్రోత్సహించే ప్రగతిశీల, ప్రోత్సా హకర విధానాలు, ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలు, ప్లగ్ -అం డ్ -ప్లే పారిశ్రామిక పార్కులు, అనుమతుల కోసం సింగిల్ విండో సిస్టమ్, దేశంలోనే సాటిలేని స్టెమ్ టాలెంట్, స్థిరమైన ప్రభు త్వం, సమర్థవంతమైన నాయకత్వం, ఎక్కడైనా సులభంగా చేరుకునేలా రవాణ సౌకర్యాలు అందుబా టులో ఉన్నాయని వివరించారు. 

ఈ రంగాల్లో పెట్టుబడులు పెట్టండి 

సెల్ అండ్ జీన్ థెరపీ, బయోలాజిక్స్ అండ్ బయోసిమిలర్స్, ఎంఆర్‌ఎన్‌ఏ వ్యాక్సిన్లు, కాంట్రాక్ట్ రీసెర్చ్, డెవలప్మెంట్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్, డయాగ్నస్టిక్స్, మెడ్‌టెక్, ఏఐ ఆధారిత డిజిటల్ హెల్త్, హెల్త్‌టెక్, ఏపీఐ బల్క్ డ్రగ్ ఉత్పత్తి, ఫార్మా ప్యాకేజింగ్, గ్లాస్ ట్యూబింగ్, ట్రాన్స్‌లేషనల్ బయోటెక్ రీసెర్చ్, ఏఐ ఆధారిత డ్రగ్ డిస్కవరీ, జీనోమిక్స్, గ్రీన్ బయో మాన్యుఫ్యాక్చరింగ్, అగ్రి బయోటెక్, యానిమల్ హెల్త్ తదితర రంగాల్లో తెలంగాణలో అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని శ్రీధర్‌బా బు పేర్కొన్నారు. వీటిల్లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాల ని ఆస్ట్రేలియా కంపెనీలను కోరారు. తమ ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. 

ఈ సదస్సు ‘విక్టోరియా-తెలంగాణ ఇన్నోవేషన్ కారిడార్’కు నాంది పలకాలని ఆకాంక్షించారు. వచ్చే ఫిబ్రవరిలో హైదరాబాద్‌లో నిర్వహించనున్న బయో ఏషియా సదస్సుకు హాజరుకావాలని దిగ్గజ లైఫ్ సెన్సైస్ పరిశ్రమలను ఆహ్వానించారు. కార్యక్రమంలో విక్టోరియా రాష్ర్ట మంత్రులు రోస్ స్పెన్స్, డానీ పియర్సన్ ఎంపీ, ఆస్ బయోటెక్ చైర్మన్ డాక్టర్ జేమ్స్ క్యాంప్‌బెల్, తెలంగాణ ఇన్వెస్ట్మెంట్ సెల్ డైరెక్టర్ మధు సూదన్, తెలంగాణ లైఫ్ సెన్సైస్ ఫౌండేషన్ సీఈవో శక్తి నాగప్పన్ తదితరులు పాల్గొన్నారు.