calender_icon.png 30 June, 2025 | 9:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అక్రమంగా ఎర్రరాయి తవ్వకాలు!

30-06-2025 01:43:53 AM

  1. కర్ణాటకకు అక్రమ రవాణా
  2. ఫిర్యాదు చేసినా పట్టించుకోని మైనింగ్ అధికారులు
  3. చెక్పోస్టుల్లో అమ్యామ్యాల దందా
  4. నిద్రమత్తులో రెవెన్యూ శాఖ
  5. నిమ్జ్ భూముల్లోనూ తవ్వకాలు 
  6. చోద్యం చేస్తున్న అధికారులు

జహీరాబాద్, జూన్ 29 : జహీరాబాద్ నియోజకవర్గంలోని న్యాల్కల్, జహీరాబాద్, మొగుడంపల్లి మండలాలలోని వివిధ గ్రామాలలో గల రెవెన్యూ భూములలో ఎర్రరాయి తవ్వకాలు జరుగుతున్నాయి. ఈ రా యి వల్ల భవనాలు, ప్రహరీ గోడలు నిర్మించేందుకు ఉపయోగిస్తున్నారు. న్యాల్కల్ మండలంలోని గణేష్ పూర్, హగ్నూర్, రేజింతల్, న్యామతాబాద్ గ్రామ శివారులో ఎర్ర రాయిని యంత్రాల సహాయంతో వెలికి తీసి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ ఎర్రరాయిని సరిహద్దు రాష్ట్రమైన కర్ణాటకలోని బీదర్ పరిసర గ్రామాలకు సరఫరా చేస్తున్నారు.

సరిహద్దులో చెక్పోస్టు ఉన్నప్పటికీ అక్రమార్కులు ఇచ్చే మామూళ్ళను తీసుకొని ఎర్రరాయి లారీలను, ట్రాక్టర్లను వదులుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. జహీరా బాద్ ప్రాంతంలో ఏర్పాటు కానున్న నిమ్జ్కు ప్రభుత్వం వందలాది ఎకరాలను రైతుల వద్ద నుండి తీసుకున్నారు. ఆ భూముల్లో కూడా ఎలాంటి అనుమతులు లేకుండా ఎ ర్రరాయిని తీసి సొమ్ము చేసుకుంటున్నా ని మ్జ్ అధికారులు గానీ రెవెన్యూ అధికారులు గానీ పట్టించుకోవడం లేదు. ఎర్ర రాయి గనుల నుంచి సంపద తరలిపోతుందని మండల తహసిల్దార్ కు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోవడం లేదని ఆరోపణలు ఉ న్నాయి.

గత కొన్ని రోజుల క్రితం హద్దునూ ర్ పోలీసులు గంగ్వార్ చెక్పోస్టు వద్ద అక్రమంగా తరలిస్తున్న ఎర్ర రాయి ట్రాక్టర్లను పట్టుకొని కేసులు నమోదు చేసినప్పటికీ వారు ఎర్రరాయిని యధావిధిగా తీస్తూ అమ్ముకుంటున్నారు. దీనికి సంబంధించి జిల్లా మైనింగ్ అధికారులకు సమాచారం ఉన్నప్పటికీ మైనింగ్ అధికారులు కూడా వారు ఇచ్చే ఆమ్యామ్యాలకు లోబడి తనిఖీలు నిర్వహించడం లేదు.

మైనింగ్ అధికారులు ఆయా ప్రాంతాలలో తిరిగి ఎంత మేరకు రాయిని తీశారని దానిపై సమగ్ర విచారణ జరిపి క్యూబిక్ మీటర్ ప్రకారము అపరాధ రుసుము వేయవలసి ఉన్నప్పటికీ అక్రమార్కులకు అండగా ఉంటున్నారని ప్రజలు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. జహీరాబాద్ మండలంలోని సున్నం బట్టి తండా, ఆనేగుంట, కాసింపూర్ తదితర గ్రామాలలో ఎర్రరాయిని తీసి అమ్ముకుంటున్నప్పటికీ ఇక్కడి అధికారులు కూడా చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు.

ఎర్రరాయి కోసం తవ్వకాలు చేయడం వల్ల పెద్ద పెద్ద గుంతలు ఏర్పడి ప్రమాదకరంగా మారుతున్నప్పటికీ అధికార యంత్రాంగం చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణము చేపట్టాలని ప్రభుత్వం ఇళ్లను మంజూరు చేసి లబ్ధిదారులకు ఇల్లు కట్టుకునేందుకు అవకాశాన్ని ఇచ్చారు. ఈ ఇల్లు నిర్మించేందుకు ఎర్రరాయి అవసరం పడడంతో దీనికి డిమాండ్ పెరిగింది. దీంతో ఎర్ర రాయి తీసేందుకు ఘనుల యజమానులు ఎక్కువ ధరకు ఎర్రరాయిని విక్రయిం చి సొమ్ము చేసుకుంటున్నారు.

కాగా ప్రభుత్వానికి ఎలాంటి రుసుము చెల్లించకపోవ డంతో ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్నారు. ప్రతిరోజు జహీరాబాద్ ప్రాంతం నుండి దాదాపుగా 20 నుంచి 25 లారీల ఎర్రరాయి ఇతర ప్రాంతాలకు వెళ్తున్నట్లు సమాచారం. ఈ ఎర్రరాయి అక్రమ రవాణాను అడ్డుకొని ప్రభుత్వ ఖజానాకు నష్టం జరగకుండా చూడాలని, అలాగే అనుమతులు లేకుండా తవ్వకాలు చేస్తున్న అక్ర మార్కులకు కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.