నా మనసు నిను చూసీచూడగానే..
03-06-2026 12:53 AM
వడ్డే క్రియేషన్స్ బ్యానర్పై వడ్డే నవీన్ హీరోగా, నిర్మాతగా రూపొందించిన చిత్రం ‘ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు’. కమల్ తేజ నార్ల దర్శకుడు. వడ్డే నవీన్, రాశి సింగ్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం జూన్ 19న రిలీజ్ కానుంది. మేకర్స్ ఈ సినిమా నుంచి ‘నువ్వే కదా..’ అనే రెండో గీతాన్ని ఎఫ్ఎం రేడియో స్టేషన్లో విడుదల చేశారు. నా మనసు నిను చూసీచూడగానే నచ్చేశావు అని అంటోందే.. ఇన్నాళ్లు ఎక్కడున్నావంటూ నీమీదే అలుగుతోందే..’ అంటూ సాగుతోందీ పాట. కళ్యాణ్ నాయక్ స్వరపర్చిన ఈ పాటను భాస్కరభట్ల రాయగా, పీవీఎన్ఎస్ రోహిత్, హరిణి ఇవటూరి పాడారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: కార్తీక్ సుజాత సాయికుమార్; ఎడిటర్: విజయ్ ముక్తావరపు.






