19-11-2025 12:00:00 AM
ఖైరతాబాద్: నవంబర్ 18 (విజయ క్రాం తి): భాగ్యనగరం ప్రకృతిలో పక్షుల సంపద ఎనలేనిదని, పక్షుల ప్రేమికులు లక్షల సంఖ్య లో ఉన్నారని ప్రముఖ ఆర్నిథాలజిస్ట్, ఇండియన్ బరడ్స్ జర్నల్ సీనియర్ ఎడిటర్ ఆశిష్ పిట్టి తెలిపారు. మంగళవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో కళ పత్రిక, జయహో పబ్లికేషన్స్ ఆధ్వర్యంలో రిటైర్డ్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ వి.ఎ.మంగ రచన రేఖా చిత్రాలతో రూపొందించిన బర్డ్ వాచర్ జర్నల్ పుస్తకావిష్కరణ ఘనంగా జరిగింది.
హైదరాబాద్ ఆర్నిథాలజిస్ట్ ఆశిష్ పిట్టి ఈ పుస్తకాన్ని ఆవిష్కరించి రచయిత్రి, చిత్రకారిణి, ఫోటోగ్రాఫర్ వి. ఎ.మంగను అభినందించారు. ఇటీవల కాలం లో భాగ్యనగరంలో బర్డ్ వాచింగ్ అభిరుచి ఉధ్రుతంగా పెరిగిందన్నారు. సభాధ్యక్షత వ హించిన కళ పత్రిక సంపాదకులు డాక్టర్ మ హ్మద్ రఫీ మాట్లాడుతూ సరళమైన తెలుగు భాషలో అందమైన అరుదైన పక్షుల విశేషాలతో పుస్తకం ఆసక్తికరంగా రచయిత్రి మంగ తీసుకొచ్చారని అభినందించారు.
డాక్టర్ వి. ఎ. మంగ మాట్లాడుతూ ఉద్యోగ విరమణ తరువాత సరదాగా తీసిన ఫోటోగ్రఫీకి చిక్కిన తేనె పిట్ట తనలో పక్షులపై విపరీతమైన ఆసక్తిని పెంచి అభిరుచిగా మార్చినట్లు తెలిపారు. సినీ దర్శకుడు శివ నాగేశ్వరరావు, తెలంగాణ సారస్వత పరిషత్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ జె. చెన్నయ్య పుస్తకాన్ని సమీక్షిస్తూ పక్షులతో తమకున్న అనుబంధాన్ని అనుభవాలను వివరించారు. జయహో పబ్లికేషన్స్ పి.వై.బాబు సమన్వయం చేశారు.