17-06-2025 08:21:51 PM
మంథని మాజీ జెడ్పిటిసి మూల సరోజన పురుషోత్తం రెడ్డి..
మంథని (విజయక్రాంతి): కాంగ్రెస్ అంటేనే రైతుల ప్రభుత్వమని రైతుల సంక్షేమ ప్రభుత్వం ధ్యేయమని మంథని మాజీ జడ్పిటిసి మూల సరోజన పురుషోత్తం రెడ్డి(former ZPTC Moola Sarojana Purushotham Reddy) ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే రైతులకు న్యాయం జరుగుతుందని, మేనిఫెస్టోలో పెట్టిన విధంగా రైతులందరికీ ఎలాంటి కోత లేకుండా ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలకు అకౌంట్లో డబ్బులు వేస్తున్నారని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారన్నారు.
బడ్జెట్లో దాదాపు రూ. 70 వేల కోట్లకు పైగా రైతు సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కేటాయిస్తుందని, రైతు భరోసా పథకంతో రూ. 70 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరుతుందన్నారు. రెండు లక్షల రుణమాఫీతో పాటు రైతులందరికీ రైతు భరోసా ఇవ్వడాన్ని రైతులందరూ స్వాగతించాలని, రాబోయే ఎన్నికల్లో మంథని నియోజకవర్గంలో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆధ్వర్యంలో రైతులందరూ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాలని ఆమె కోరారు. రైతు భరోసా పంట పెట్టుబడి కింద డబ్బులు వేస్తున్నందుకు సీఎం రేవంత్ రెడ్డికి, మంత్రి శ్రీధర్ బాబుకు ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.