calender_icon.png 1 June, 2025 | 8:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేద ప్రజల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం

31-05-2025 01:23:40 AM

వర్ధన్నపేట ఎమ్మెల్యే కె.ఆర్ నాగరాజు

హనుమకొండ, మే 30 (విజయక్రాంతి): సీఎంఆర్‌ఎఫ్ పేద, మధ్య తరగతి ప్రజలకు వరంగా మారిందని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్నారు.

నేడు హన్మకొండ సుబేదారి లోని ఎమ్మెల్యే నివాస క్యాంప్ కార్యాలయం నందు వర్ధన్నపేట టౌన్ 2వ వార్డుకి చెందిన వడ్లకొండ సాయి చరణ్ లివర్ సమస్య తో ప్రైవేట్ ఆసుపత్రిలో చేరి 45 లక్షల ఖర్చు చేసిన కూడ మరణించగా ఆ సమాచారం తెలియగానే ఎమ్మెల్యే సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా  వెంటనే స్పందించి ప్రజా ప్రభుత్వం ఏర్పడ్డాక రాష్ట్రంలో మొదటి సారిగా గొప్ప ఆలోచనతో ఏకంగా ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి 6 లక్షల రూపాయల మంజూరు చేయగా నేడు ఆ చెక్కును లబ్ధిదారునికి అందజేశారు.

కాంగ్రెస్ ప్రభుత్వంలో  అర్హులందరికీ  ముఖ్యమంత్రి సహాయ నిధి  బిల్లులను సకాలంలో చెల్లిస్తున్నందనీ తెలిపారు.ఈ కార్యక్రమంలో వర్ధన్నపేట టౌన్ అధ్యక్షుడు మైస సురేష్, కాంగ్రెస్ నాయకులు అనిమిరెడ్డి కృష్ణారెడ్డి, కిషోర్, టౌన్ మాజీ కౌన్సిలర్లు సమ్మేట్ట సుధీర్, మంచాల రామకృష్ణ, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.