19-06-2025 12:19:18 AM
టేకులపల్లి, జూన్ 18 (విజయక్రాంతి): టేకులపల్లి మండలం స్టేషన్ తడికలపూడి గ్రామంలో ఓ యువకుడు పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన చోటు చేసుకుంది. టేకులపల్లి పోలీసుల కథనం ప్రకారం.. స్టేషన్ తడికలపూడికి చెందిన గుగులోత్ భద్రు కుమారుడు గుగులోత్ తరుణ్ (20) 10 ఏళ్ల క్రితం ఇంటి పై నుండి కింద పడడంతో తలకు బలపైన గాయం తగలడం వలన అప్పుడప్పుడు మతిస్థిమితం లేనివాడుగా పవర్తిస్తుంటాడు.
ఈ నెల 16 న మతిస్థిమితం లేమితో ఇంట్లో ఎవరు లేని సమయమున ఇంట్లో మిగిలి ఉన్న పురుగుల మందు తాగి కుటుంబ సభ్యులకు విషయాన్ని తెలిపాడు. వెంటనే కుటుంబ సభ్యులు హాస్పిటల్ కు తీసుకొని వెళ్లగా చికిత్స పొందుతూ మృతి చందాడని, తండ్రి పిర్యాధి మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.