4 May, 2026 | 2:32 PM

Breaking News

ప్లాస్టిక్ గ్లాస్లో చాయ్ తాగితే 3,000 జరిమానా   •   కాంగ్రెస్ పార్టీ హనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శిగా మారం రెడ్డి కౌటిల్ రెడ్డి   •   రైతు వేదికల్లో రైతులకు అవగాహన సదస్సులు   •   కాంగ్రెస్ పార్టీలో మైనారిటీలకు ప్రాధాన్యత లేదు: ఎండీ ఖాజా భక్ష్   •   అగ్ని ప్రమాదంలో 44 లక్షల పంట నష్టం 47 ఎకరాల్లో దగ్ధం   •   అకాల వర్షాలతో కొమరారం కేంద్రంలో తడిసిన మొక్కజొన్న   •   మొక్కజొన్నకు అగ్ని ప్రమాదాలు   •   జిల్లాలో ఉచిత క్రీడా శిక్షణ శిబిరాలు   •   మొక్కజొన్న పంట నష్టపోయిన రైతాంగానికి ఎకరానికి 50,000 పరిహారంగా ఇవ్వాలి   •   తరాల చరిత్రను మార్చిన ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు   •  

పీఎంశ్రీ ఫుట్‌బాల్ కప్ విజేత రాజాపూర్

08-01-2026 01:29 AM

రాజాపూర్ జనవరి 7: పిఎం శ్రీ  పథకంలో భాగంగా జిల్లా స్థాయి బాలుర విభాగంలో పుట్ బాల్ క్రీడా పోటీలో రాజాపూర్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబర్చి విజేతగా నిలిచినట్లు ప్రధానోపాధ్యాయుడు సయ్యద్ ఇబ్రహీం తెలిపారు. బుధవారం మహబూబ్ నగర్ స్టేడియం గ్రౌండ్ లో నిర్వహించిన ఆటల పోటీలలో 24 పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు.

పిఎం శ్రీ క్రీడా పోటీలలో రాజాపూర్ విద్యార్థులు బాలుర విభాగంలో  ఫుట్ బాల్ ఫైనల్ చేరుకొని జట్టు సభ్యులు చక్కటి క్రీడా స్ఫూర్తిని ప్రదర్శిస్తూ సమన్వయము తో ఆడి ఫుట్ బాల్ కప్ ను కైవసం చేసుకున్నారు. కప్ గెలిచినా విద్యార్థులను ప్రధానోపాధ్యాయులు సయ్యద్ ఇబ్రహీం ఫిజికల్ డైరెక్టర్ వెంకటమ్మ,స్పోరట్స్ కోచ్ ప్రకాష్ ప్రత్యేకంగా అభినందించారు. రాష్ట్రస్థాయిలో జరిగే క్రీడా పోటిల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్ర విజేతగా నిలవాలని ఆకాంక్షించారు.