10 May, 2026 | 8:47 PM

Breaking News

సింగిరెడ్డిపల్లి యువకుని దారుణ హత్య   •   అక్రమ పశువుల రవాణాపైన సరిహద్దు చెక్ పోస్టులో పటిష్ట నిఘా   •   మోడీ సభకు తరలి వెళ్లిన నాగిరెడ్డిపేట బిజెపి నాయకులు   •   మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేంద్ర సహాయ మంత్రి దిష్టిబొమ్మ దగ్ధం   •   125 వారాలు పూర్తి అయిన హనుమాన్ చాలీసా పారాయణం   •   బండి భగీరథను వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్ట్ చేయాలి   •   మద్నూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునికి నాయకుల ఘన సన్మానం   •   కామారెడ్డి రక్తదాతల సమూహం, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ కు అవార్డుల పంట   •   అమ్మవారి ఆలయంలో కమిషనర్ పూజలు   •   కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులుగా ఎన్నికైన బజ్జూరి వెంకటరెడ్డి   •  

ప్రపంచం మాయ కాదు!

30-08-2024 12:19 AM

5న డా. సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి

డా. సర్వేపల్లి రాధాకృష్ణ చెప్పే మాయావాదానికి ఇతర భారత తత్వశాస్త్రజ్ఞులు చెప్పే మాయావాదానికి చాలా తేడా వుంది. తన దృష్టిలో మాయావాదమంటే మిధ్యావాదం కాదు. ప్రపంచం మాయ అంటే ‘ప్రపంచం లేదు’ అని కాదు. ‘ఈ ప్రపంచం అనాది పదార్థం కాదని’ మాత్రమే ఆయన ఉద్దేశ్యం. అయితే, ఈ ప్రపంచం అవాస్తవికమైందనిగానీ, లేనిదనిగానీ, అర్థం చెప్పటానికి వీల్లేదు. ఈ ప్రపంచం వాస్తవికమైందనే ఆయన నిర్ణయం. దాని అస్తిత్వం వారి పూర్ణభావాలలో ఇమిడిఉంది. ఈ ప్రపంచంలో కనపడే, రూపభేదాలకు మూలం పరిపూర్ణ భావంలో వుంది.

అయితే, ఈ ప్రపంచం అవాస్తవికమైందనిగానీ, లేనిదనిగానీ అర్థం చెప్పటానికీ వీల్లేదు. ఈ ప్రపంచం వాస్తవికమైందనే ఆయన నిర్ణయం. దాని అస్తిత్వం వారి పూర్ణభావాలతో ఇమిడి ఉంది. ఈ ప్రపంచంలో కనపడే, రూపభేదాలకు మూలం పరిపూర్ణ భావంలో వుంది. అయితే, ఈ రూపభేదాలు బ్రహ్మ సమగ్రతను గాని, పరిపూర్ణతను గాని కదిలించలేవు. ఈ విధంగా రాధాకృష్ణ పండితులు ప్రాచ్య పాశ్చాత్య దృష్టులను కూడా సమన్వయపరచ గలిగారు.

ఇందువల్లనే భారత తత్వశాస్త్రాన్ని పాశ్చాత్యులు సానుభూతితోను, ఆర్ద్రతతోను చూడగలిగారు. ప్రపంచానికి సరిపోయే ఒక విశిష్ట తత్వశాస్త్రానికి పునాది వెయ్యగలిగారు. వీరు ప్రచారం చేసే ఆత్మతత్వ తాత్విక దృష్టి ప్రకారం, మూలసూత్రాల్లో అన్ని మతాలూ ఒకటే. అన్ని మతాల సారాంశం ఒకటే. ఎందుకంటే, మతమనేది ఒక సిద్ధాంతం కాదు. కొన్ని సూత్రాల సంపుటీకరణం కాదు. 

-  గోపీచంద్ ‘తత్వవేత్తలు’ నుంచి..