26-05-2025 06:36:44 PM
హుండీలోని డబ్బులు దోచుకెళ్లిన దొంగలు..
తూప్రాన్ (విజయక్రాంతి): తూప్రాన్ మండలం(Toopran Mandal) మల్కాపూర్ ఆదర్శ గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయం(Sri Durga Malleswara Swamy Temple)లో అర్ధరాత్రి దుండగులు చోరీకి పాల్పడ్డారు. గర్భగుడి తలుపుల తాళాలను స్టీల్ రాడ్ తో పగలగొట్టి హుండీ డబ్బులను దొంగలించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. సీసీ పుటేజ్ ఆధారంగా నిందితుడు మల్కాపూర్ గ్రామానికి చెందిన మహమ్మద్ జహంగీర్ గా పోలీసులు గుర్తించారు.
గతంలో దుర్గమ్మ ఆలయ హుండీని సైతం పగలగొట్టి నగదును దోచుకెళ్ళాడు, అలాగే గ్రామానికి చెందిన భేతి శకుంతల ఇంటి తాళాలు పగలగొట్టి నగదు, బంగారం దోచుకెల్లగా శకుంతల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో పోలీసు విచారణలో నిందితుడు జహంగీర్ నేరం రుజువు కావడంతో కేసు నమోదయింది. గర్భగుడిలోకి చొరబడి ఆలయ పవిత్రతకు భంగం కలిగించడంతో పాటు హుండీ పగలగొట్టి నగదుతో ఊడయించిన నిందితుడుపై పోలీసులు కఠిన చర్య తీసుకోవాలని ఆలయ ఫౌండర్ అమిరిశెట్టి సతీష్ గుప్తా తూప్రాన్ ఎస్సై శివానందం కు ఫిర్యాదు చేశాడు.