31-05-2025 11:18:20 PM
ఆయుష్ యోగ కోచ్ కరణం శ్రీదేవి...
చేగుంట (విజయక్రాంతి): ప్రపంచ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈ రోజు చేగుంటలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో యోగా, ప్రాణాయామం చేయించడం జరిగిందని ఆయుష్ యోగా కొచ్ కరణం శ్రీదేవి(Ayush Yoga Coach Karanam Sridevi) తెలిపారు. నెల రోజుల శిక్షణలో భాగంగా ఈ రోజు చేగుంటలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో యోగా, ప్రాణాయామం, వాటిని ప్రతి రోజూ ఆచరించడం, వాళ్ళ మానవ శరీరానికి కలిగే ఉపయోగాలు తెలియచేయడం జరిగిందన్నారు.
వాటిలో ముఖ్యంగా ప్రతి రోజు యోగను ఆచరించడం వల్ల మానవ శరీరంలోని 600 కండరాలు, 202 ఎముకలు, 72 వేల నాడులతో పాటు శరీరంలోని ముఖ్యమైన అవయాలైన గుండె, మెదడు, కాలేయం, ఊపిరితిత్తులు, కిడ్నీలు, అన్నవాహిక, ప్రేగులతో పాటు అన్ని అవయవాలు మెరుగుపడి ఆరోగ్యంగా ఉంటారని, ప్రాణాయామం వలన ముఖవర్చస్సుతో పాటు ఏకాగ్రత పెరిగి నిత్య యవ్వనంగా ఉంటారని తెలిపారు. ప్రతి రోజూ యోగా చేయడం వలన షుగర్, రక్తపోటు, గుండె జబ్బులు, ఆస్తమా, మెదడుకు సంబంధించిన వ్యాధులతో పాటు ప్రతి వ్యాధిని నియంత్రించవచ్చని తెలిపారు.యోగా,ప్రాణాయామం వలన రోగులు మందులు వాడవలసి అవసరం ఉండదని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ అనిల్ కుమార్, డాక్టర్ మృదుల, డాక్టర్ మనోహర్, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ లు సంపతి, ఫహింపాష, రాజిరెడ్డి, వైద్య సిబ్బంది రాజేష్, నీలిమ, అనితా, నరేష్ తదితరులు పాల్గొన్నారు.