calender_icon.png 2 June, 2025 | 12:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోతాన్ పల్లిలో సివిల్ రైట్స్ డే కార్యక్రమం

31-05-2025 11:15:34 PM

గ్రామాల్లో కుల, మత బేధాలు ఉండకూడదు..

మాసాయిపేట డిప్యూటీ తహసిల్దార్ పి.వసంత.. 

మసాయిపేట్/చేగుంట (విజయక్రాంతి): మాసాయిపేట మండల పరిదిలోని  పోతాన్ పల్లి గ్రామంలో గ్రామ పంచాయతీ వద్ద శనివారం సివిల్ రైట్స్ డే(Civil Rights Day) కార్యక్రమాన్ని గ్రామపంచాయతీ వద్ద మాసాయిపేట పి. వసంత ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... గ్రామంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఇతర కులాల మధ్య తేడాలు బేధాలు రాకూడదన్నారు. చాయి, హోటల్లో, ఒకే గ్లాస్ విధానం ఉండకూడదన్నారు. గ్రామంలో ఉన్న అన్ని దేవాలయాల్లోకి దైవ దర్శనానికి వచ్చే, ఎస్సీ, ఎస్టీ, వారిని ఎవరు కూడా అడ్డుకోకూడదన్నారు, ఒకే గ్రామంలో నివసించే ప్రజలందరూ, ఒకే ఉమ్మడి ప్రాంత ప్రజలుగా కుల, మత బేధాలు లేకుండా, ఏ రకమైన తేడాలు లేకుండా ఉమ్మడిగా జీవించాలని సూచించారు. కులం పేరుతో దూషించిన వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేస్తామన్నారు.

ధర్మం, స్వేచ్ఛ, అవకాశాలు అభ్యున్నతి అనేది కేవలం కొంతమందికి, కొన్ని వర్గాల వారికే వర్తించకుండా సమాజంలోని నివసించే ప్రతి ఒక్కరికి సమాన హక్కులు అవకాశాలు కల్పించేలా పౌరహక్కులు ఉన్నాయని తెలిపారు. కులం పేరుతో దూషణకు గురైన దళితులు, గిరిజనులు ప్రభుత్వ కార్యాలయంలో తహశీల్దార్ కు, పోలీస్ స్టేషన్ లలో  ఫిర్యాదు చేయవచ్చన్నారు. విచారణ చేపట్టిన అనంతరం నిరూపణ అయిన తర్వాత కులం పేరుతో దూషించిన వారిపై చట్టపరమైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయడానికి అవకాశాలు ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ ధన్ సింగ్, పంచాయతీ కార్యదర్శి అశోక్, నేషనల్ కన్జ్యూమర్ రైట్స్ కమిషన్ మెదక్ జిల్లా చైర్మన్ బాలసాయి హరిప్రసాద్, అడవి చైర్మన్ కారింగుల అంజిరెడ్డి, ఫీల్డ్ అసిస్టెంట్ ఎర్ర యాదగిరి, మాజీ వార్డు సభ్యులు ఎల్లం, శ్రీకాంత్, శేఖర్ రెడ్డి, శ్రీరాములు, కనకరాజు, సాయి, శేఖర్, అనిల్, చంద్రయ్య, మల్లయ్య, బిక్షపతి, అంజయ్య, పెంటయ్య, నరసయ్య పెంటయ్య, తదితరులు పాల్గొన్నారు.