9 May, 2026 | 3:37 PM

Breaking News

బంద్ విజయవంతం చేసిన ప్రజలకు ధన్యవాదాలు   •   బండి సంజయ్ కొడుకుపై పోక్సో కేసు.. స్పందించిన సబితా ఇంద్రారెడ్డి   •   రేపు హైదరాబాద్‌కు ప్రధాని మోదీ.. పర్యటన షెడ్యూల్‌ ఇదే..!   •   వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా సహకార అధికారి రామ్మోహన్ రావు   •   సొసైటీ అసిస్టెంట్ మృతుడు కుటుంబానికి ఆర్థిక సాయం అందజేత   •   VOAల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా   •   సచివాలయంలో పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశం   •   శ్రీశైలంలో మరో సైబర్ మోసం.. ఢిల్లీ భక్తులకు టోకరా   •   బొంద పెట్టడానికి స్థలం లేదు..!   •   రాష్ట్ర ప్రభుత్వం పంట కొనుగోళ్ల కోసం చిత్తశుద్ధితో పని చేస్తుంది   •  

రోడ్ల నిర్మాణంలో నాణ్యతపై రాజీ పడేది లేదు

18-06-2025 12:00 AM

మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి 

మునుగోడు, జూన్ 17 : నియోజకవర్గంలోని ప్రతి రోడ్డు 5.5 మీటర్ల వెడల్పు ఉండాల్సిందేనని రోడ్ల నిర్మాణంలో నాణ్యతపై రాజీ పడేది లేదని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం మునుగోడు నియోజకవర్గంలో పంచాయతీరాజ్, ఆర్ అండ్ బి శాఖ ల ఆధ్వర్యంలో నిర్మిస్తున్న రోడ్ల పనుల పురోగతిపై మునుగోడు లోని అధికారిక క్యాంపు కార్యాలయంలో పంచాయతీరాజ్, ఆర్ అండ్ బి అధికారులు, రోడ్డు నిర్మాణ కాంట్రాక్టర్లతో సమీక్ష సమావేశంలో మాట్లాడారు.

సాగర్ రోడ్డు నుండి ముష్టిపల్లి వరకు, ముష్టిపల్లి నుండి నాంపల్లి వరకు జరుగుతున్న ఆర్ అండ్ బి రోడ్ల పనులు ఎంతవరకు వచ్చాయని కాంట్రాక్టర్లను అడిగి తెలుసుకున్నారు.అంగడిపేట నుండి లెంకలపల్లి వరకు చేపట్టబోయే రోడ్డు పనులకు సంబంధించి టెండర్ ప్రొసీజర్ ఎంతవరకు వచ్చిందని,నాంపల్లి నుండి ఇడికుడ వరకు, ఇడికుడ నుండి కమ్మగూడెం(తెరట్ పల్లి) వరకు ఉన్న పంచాయతీరాజ్ రోడ్లను ఆర్ అండ్ బి రోడ్లుగా మార్చిన తర్వాత వాటి పనులకు సంబంధించి పురోగతిపైఆరాతీశారు.