21 March, 2026 | 1:58 PM

Breaking News

ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించిన మైనంపల్లి సర్పంచ్   •   నిరుపేద ముస్లింలకు రంజాన్ మోదీ కిట్‌ల పంపిణీ   •   రంజాన్ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే తోటలక్ష్మికాంతారావు   •   బీసీలకు బడ్జెట్‌లో తీవ్ర అన్యాయం   •   ప్రభుత్వం దిష్టిబొమ్మ దహనం   •   జీవన్ రెడ్డికి బుజ్జగింపులు.. తన నిర్ణయంలో మార్పులేదన్న సీనియర్ నేత   •   తస్మాత్ జాగ్రత్త.. సమోసా, పఫ్స్ ప్రియులకు షాకింగ్ సీన్   •   రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన సీఎం, డిప్యూటీ సీఎం   •   'శ్రమ మాది.. శిలాఫలకాలు మీవి'.. రిబ్బన్ కటింగ్ చేయడమే కాంగ్రెస్ పని   •   వేరే వ్యక్తిని పెండ్లి చేసుకుందని.. తండ్రితో వెళ్లి మహిళపై ప్రియుడు దాడి   •  

ఉమ్మడి జిల్లా ఇంచార్జి మంత్రిని కలిసిన టీ పీసీసీ ప్రధాన కార్యదర్శి

18-06-2025 12:00 AM

సన్మానించిన కామారెడ్డి మున్సిపల్ మాజీ చైర్ పర్సన్

కామారెడ్డి, జూన్ 17 (విజయ క్రాంతి): ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి, రాష్ట్ర  పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, (గ్రామీణ నీటి సరఫరాతో సహా, స్త్రీ శిశు సంక్షేమం, మంత్రివర్యులు సీతక్కను మంగళవారం కామారెడ్డి మాజీ మున్సిపల్ చైర్మన్ గడ్డం హిందూప్రియ, ఇటీవల టీపీసీసీ ప్రధాన కార్యదర్శిగా నియామకమైన గడ్డం చంద్రశేఖర్ రెడ్డి, మాజీ కౌన్సిలర్లతో కలిసి మంత్రిని సన్మానించారు.

మర్యాదపూర్వకంగా కలిసిన అనంతరం కామారెడ్డి సమస్యలను మంత్రికి విన్నవించినట్లు టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. మర్యాదపూర్వకంగా కలిసిన ట్లు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి తెలిపారు. ఈ సందర్బంగా సీతక్క కు పుష్పగుచ్చం అందించారు. తనకు టీపీసీసీ ప్రధాన కార్యదర్శిగా నియమించినందుకు సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదములు తెలిపారు. 

కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని, ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్ళాలని ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క కోరినట్లు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. కామారెడ్డిలో పార్టీ పరిస్థితిని సీతక్క అడిగి తెల్సుకున్నారని తెలిపారు.

కామారెడ్డి అభివృద్ధికి ప్రత్యేక నిధులు ఇవ్వాలని కోరగా, మంత్రివర్యులు సీతక్క, సానుకూలంగా స్పందించినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో, మాజీ మున్సిపల్ చైర్మన్, గడ్డం ఇందుప్రియ, మాజీ కౌన్సిలర్లు, జూలూరి సుధాకర్, పంపరి లతా శ్రీనివాస్,పాత శివ కృష్ణమూర్తి, చాట్ల వంశీ కృష్ణ, పిడుగు మమతా సాయిబాబా, సలీం,  తదితరులు పాల్గొన్నారు.