19-06-2025 01:32:54 AM
యుద్ధం మొదలైంది.. ఇక దయ చూపను
అమెరికా సైన్యం జోక్యం చేసుకుంటే చూస్తూ ఊరుకోం
టెహ్రాన్/టెల్ అవీవ్, జూన్ 18: ‘యుద్ధం మొదలైంది.. అలీ తన జుల్ఫికర్ (కత్తి)తో ఖైబర్కు చేరుకున్నారు.. ఇజ్రాయెల్ ప్రజలపై దయ చూపాల్సిన పని లేదు.. ట్రంప్ బెదిరింపులకు భయపడి లొంగిపోయే ప్రసక్తే లేదు. మాపై దాడి చేసి ఇజ్రాయెల్ భారీ తప్పిదం చేసింది. అందుకు తగిన శిక్ష అనుభవించాల్సిందే.. మా మధ్య జరుగుతున్న యుద్ధంలో అమెరికా సైన్యం జోక్యం చేసుకుంటే చూస్తూ ఊరుకోం’ అని ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
మరోవైపు ఖమేనీ వ్యాఖ్యలపై అమెరికా అధ్యక్షు డు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఇరాన్పై దాడి చేసే విషయమై ట్రంప్ మాట్లాడుతూ.. ‘నేను దీనిని చేయొచ్చు.. చేయకపోవచ్చు.. నేను ఏం చేయనున్నానో ఎవరికి తెలియదు’ అని వ్యాఖ్యానించారు. వారం క్రితం.. ఇప్పటి పరిస్థితులకు చాలా తేడా ఉందన్నారు. ఇరాన్పై ఇజ్రాయెల్ దాడుల్లో జో క్యం చేసుకుంటానో లేదో తెలియదని పేర్కొన్నారు.
అంతకుముందు ఖమేనీ ఎక్కడ దాక్కున్నారో తమకు తెలుసునని.. ఆయన భేషరతుగా లొంగిపోతే మంచిదని ట్రంప్ హెచ్చరించిన నేపథ్యంలో ఇరాన్ సుప్రీం లీడర్ బుధవారం ఉదయం సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా వరుస పోస్టులతో ఇజ్రాయెల్కు, అమెరికాకు గట్టి హెచ్చ రికలు జారీ చేశారు. తాము ఎవరి బెదిరింపులకు భయపడమనే విషయం ఇరాన్ చరిత్ర తెలిసిన వారికి అర్థమవుతుందన్నారు.
ఖమే నీ పోస్టు నేపథ్యంలో ఆరోరోజు యుద్ధంలో ఇరాన్ తన అమ్ముల పొదిలోని అత్యంత శక్తిమంతమైన ఫత్తాహ్-1 హైపర్సోనిక్ క్షిపణు లతో ఇజ్రాయెల్పై విరుచుకు పడింది. ఇరా న్ ప్రయోగించిన హైపర్ సోని క్ క్షిపణులతో ఇజ్రాయెల్ వద్ద సమాధానం లేకుండా పోయింది. ఫత్తాహ్-1 మిస్సైల్ ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీసే అవకాశముంది. మంగళవారం అర్ధరా త్రి దాటిన తర్వాత టెల్ అవీవ్ లక్ష్యంగా ఇరాన్ వరుస క్షిపణులు, డ్రోన్లతో దాడులు నిర్వహించింది.
దీంతో టెల్ అవీవ్లో నివసిస్తున్న చాలా మంది ప్రజలు బంకర్లలో తలదాచుకుంటున్నారు. మరోవైపు ఇజ్రాయెల్ కూడా తమ దాడులను మరింత తీవ్రతరం చేసింది. ఇరాన్లోని అణు శుద్ధి కేంద్రాలే లక్ష్యంగా ఇజ్రా యెల్ దాడులు జరుపుతోంది. తాజాగా టెహ్రాన్ అణు కార్యక్రమానికి అత్యంత కీలక పరికరమైన సెంట్రిఫ్యూజ్ల తయారీ కేంద్రం పై ఇజ్రాయెల్ రక్షణ దళాలు (ఐడీఎఫ్) ఫైటర్ జెట్ లు దాడి చేశాయి.
ఈ కేంద్రంపై దాదాపు 50 యుద్ధ విమానాలు ఏకకాలంలో విరుచుకుపడ్డాయి. దీంతో పాటు చాలా ఆయుధ తయారీ కేంద్రాలను కూడా ధ్వంసం చేసినట్టు ఐడీఎఫ్ పేర్కొంది. ఇరాన్లో 1100 లక్ష్యాలను తమ వాయుసేన ధ్వంసం చేసిందని ఐడీఎఫ్ ప్రతినిధి బ్రిగేడియర్ జనరల్ ఎఫీ డెఫ్రిన్ పేర్కొన్నారు. ఇప్పటివరకు ఇరాన్కు చెందిన 70 ఎయిర్ డిఫెన్స్ బ్యాటరీ లను సైతం ధ్వంసం చేసినట్టు తెలిపారు.
ఇరాన్లోని అతిపెద్ద అణు కేంద్రమైన నతాంజ్ తీవ్రంగా దెబ్బతిన్నట్టు అంతర్జాతీయ అణుశక్తి సంస్థ ధృవీకరించింది. ఇక పరస్పర దాడుల్లో ఇప్పటివరకు ఇరాన్లో 585 మందికి పైగా మృతి చెందగా.. 1326 మంది గాయపడినట్టు ఆ దేశ ఆరోగ్య శాఖ పేర్కొం ది. ఇక ఇజ్రాయెల్లో మృతుల సంఖ్య 25కు చేరగా.. 1300 మంది గాయపడినట్టు ఐడీఎఫ్ ఒక ప్రకటనలో తెలిపింది.
ఎవరి బెదిరింపులకు భయపడం: ఖమేనీ
ఇజ్రాయెల్ తమపై దాడికి దిగి భారీ తప్పిదం చేసిందని, అందుకు తగిన శిక్ష తప్పదని ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ పేర్కొన్నారు. ఖమేనీ అంతమవ్వడం ఖాయమని.. అయితే అది ఇప్పుడే కాదని.. ఆయన భేషరతుగా లొంగిపోతే మంచిదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించిన వేళ ఖమేనీ ఘాటుగా స్పందించారు. హెచ్చరికలు వెలువడిన కొద్ది గంటల్లోనే ఖమేనీ తన అధికారిక ‘ఎక్స్’ ఖాతాలో స్పందించారు.
యుద్ధం మొదలైందని.. అలీ తన జుల్ఫికర్తో ఖైబర్కు చేరుకున్నారని అందులో పేర్కొన్నారు. దీంతో పాటు ఒక కోట గేటు వద్ద ఖడ్గం పట్టుకొని నిల్చొని ఉన్న వ్యక్తి ఫోటోను జత చేయగా.. కోటపై నిప్పుల వర్షం కురుస్తున్నట్టుగా ఫోటోలో కనిపించింది. ఇకపై యుద్ధంలో తాము బలంగా ప్రతిస్పందిస్తామని.. ఇజ్రాయెల్ ప్రజలపై దయ చూపించాల్సిన అవసరం లేదన్నారు. ఆ తర్వాత ఇరాన్ ప్రజలనుద్దేశించి ఖమేనీ కీలక సందేశం విడుదల చేశారు.
తాము ఎవరి బెదిరింపులకు భయపడమని.. ఇరాన్ చరిత్ర తెలిసిన వారిని అడిగితే ఆ విషయం తెలుస్తుందని ట్రంప్ను పరోక్షంగా హెచ్చరించారు. ఇజ్రాయెల్తో కొనసాగుతున్న యుద్ధంలో అమెరికా సైన్యం జోక్యం చేసుకుంటే కోలుకోలేని నష్టం ఉంటుందన్న విషయాన్ని అమెరికన్లు తెలుసుకోవాలన్నారు. ఖమేనీ వ్యాఖ్యలతో యుద్ధం మరింత తీవ్ర రూపం దాల్చినట్టయింది. అమెరికా కూడా అన్ని పరిణామాలను నిశితంగా గమనిస్తూ ఉండడంతో తర్వాత ఏం జరుగుతుందనేది ఆసక్తికరంగా మారింది.
ఏమిటీ ఫత్తాహ్-1 హైపర్సోనిక్?
ఫత్తాహ్-1 ఇరాన్ తొలి హైపర్సోనిక్ క్షిపణి. దీనిని 2023లో ఆవిష్కరించారు. ఇది సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ దీనికి పేరు పెట్టారు. ఫత్తాహ్-1 ఇజ్రాయెల్ యొక్క ఐరన్ డోమ్, ఆరో వంటి అత్యంత అధునాతన క్షిపణి రక్షణ వ్యవస్థల నుంచి తప్పించుకునేలా తయారు చేశారు. ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ దీనిని ‘ఇజ్రాయెల్ స్ట్రుకర్’గా అభివర్ణిస్తుంది. ఈ క్షిపణి 12 మీటర్ల పొడవు ఉంటుంది. 1400 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను కూడా అవలీలగా చిత్తు చేయగలదు. దీనిని సింగిల్ స్టేజ్ ప్రొపల్షన్ సిస్టమ్ ఉపయోగించిన ఘన ఇంధనంతో నడుస్తుంది.
200 కిలో గ్రా ము ల పేలుడు పదార్థాలను మోసుకెళ్లగలదు. ఫత్తాహ్-1 శత్రువుల రక్షణ వ్యవస్థల నుంచి తప్పించుకోవడానికి రూ పొందిం చబడిన హైపర్సోనిక్ గ్లుడ్ వెహికల్ వార్హెడ్తో అమర్చబడింది. గంటకు 17,900 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. ఇరాన్ ఈ క్షి పణులను ఉపయోగించడం ఇది మొదటిసారి కాదు. గతేడాది జెరూసలెంపై జరిగిన ఆపరేషన్ ట్రూ ప్రామిస్-2 సమయంలో ఇరాన్ డజన్ల కొద్దీ ఫత్తాహ్-1 క్షిపణులను ఉపయోగించింది.
ఇజ్రాయెల్లో క్షిపణుల కొరత
ఇరాన్తో యుద్ధం నేపథ్యంలో ఇజ్రాయెల్లో బాలిస్టిక్ క్షిపణుల కొరత ఏర్పటడినట్టు తెలుస్తోంది. యుద్ధం ఆరంభమైన గత వారం నుంచి ఇజ్రాయెల్.. ఇరాన్పై 400 బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. అంతకముందు హమాస్తో యుద్ధం కారణంగా చాలా మిస్సైళ్లను కూడా ప్రయోగించిన సంగతి తెలిసిందే. ఇరాన్ ప్రతీకార దాడులు రోజురోజుకు పెరిగిపోతుండటంతో ఇజ్రాయెల్ క్షిపణి రక్షణ వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతోంది.
ఇజ్రాయెల్ మరో 10-12 రోజులు మాత్రమే దాడులు కొనసాగించేందుకు క్షిపణులు ఉన్నట్టు తెలుస్తోంది. అందుకే అమెరికా సాయం తీసుకోవాలని ఇజ్రాయెల్ భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇరాన్లోని ఫోర్డ్ అణుశుద్ధి కేంద్రాన్ని నాశనం చేయడానికి అమెరికా వద్ద ఉన్న ‘బంకర్-బస్టర్’ను పంపించాలని ఇజ్రాయెల్ విజ్ఞప్తి చేసినట్టు తెలుస్తోంది.