08-06-2025 12:00:00 AM
మనదేశంలో మహిళలు ఆరోగ్య సంరక్షణ విషయంలో అజాగ్రత్తగా ఉంటుంటారు. అలసట, నీరసం, నిద్ర విషయంలో సరైన శ్రద్ధ తీసుకోరు. అవగాహన ఉన్నా లేకపోయినా ఎక్కువ శాతం మ హిళల్లో ఇలాంటి ధోరణే కనిపిస్తుంటుంది.
చిన్న విషయాలుగానే కనిపించినా దీర్ఘకాలంలో ఆరోగ్యానికి తీవ్ర నష్టం వాటిల్లు తుంది. ప్రతి సంవత్సరం తప్పకుండా మహిళలు డాక్టర్ దగ్గరకు ఆరోగ్య స్థితి గురించి కొన్ని సాధారణ టెస్టులు చేయించుకుం టూ ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో ఈ కింది రొటీన్ చెకప్స్ చేయించుకోవడంలో నిర్లక్ష్యం వహించకూడదు.
40 సంవత్సరాల మధ్య వయ స్సు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారు రొమ్ము క్యాన్సర్ బారిన పడుతున్నారు. మహిళలు ఏడాదికి ఒకసారి వైద్య పరీక్షలూ చేయించుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
గర్భాశయ క్యాన్సర్
గర్భాశయ క్యాన్సర్ ఒక తీవ్రమైన సమ స్య. మహిళలు 21 సంవత్సరాల వయస్సు వచ్చినప్పుటి నుంచి పాప్ స్మియర్ టెస్ట్ చేయించుకుంటూ ఉండాలి. ప్రధానంగా హెచ్పీవీ పరీక్షతో సహా ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి వాటిని చేయించుకోవా లి. 11 సంవత్సరాల వయస్సులోనే టీకాలు వేయించుకుంటే గర్భాశయ క్యాన్స ర్, ఇతర క్యాన్సర్ల నుంచి రక్షణ పొందవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.
థైరాయిడ్ పనితీరు
మహిళలకు ఎక్కువగా థైరాయిడ్ వ్యాధి బారిన పడుతున్నారు. థైరాయిడ్ పనితీరు పరీక్షలు (టీ3, టీ4, టీఎస్హెచ్) ముఖ్యమైనవి. సాధారణ చెకప్ కోసం వెళ్లే స్త్రీలల్లో అధికమంది థైరాయిడ్ సంబంధిత సమస్య గురించే డాక్టర్ను సంప్రదిస్తున్నారు. గర్భిణీలు లేదా పీసీఓడీ సమస్యలు, మెనోపాజ్ దశలో అడుగుపెట్టిన మహిళలు ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలి.
డయాబెటిస్ స్క్రీనింగ్
డయాబెటిస్ రోగుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతున్నది. చిన్నవయసులోనే యువత ఈ దీర్ఘకాలిక వ్యాధికి బలవుతున్నారు. కాబట్టి రక్తంలో చక్కెర లేదా హెచ్బిఎ1సి లెవెల్స్ క్రమం తప్పకుండా చెక్ చేసుకుంటూ ఉండాలి.
గుండె ఆరోగ్యం
ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి లిపిడ్ ప్రొఫైల్ మెయింటెయిన్ చేయాలి. ఫ్యామిలీ హెల్త్ హిస్టరీ ప్రకారం 20 సంవత్సరాలు లేదా అంతకు ముందు నుంచే ప్రారంభించాలి.
రక్తహీనత
మహిళల్లో రక్తహీనత చాలా సాధారణం. ఇది కొన్నిసార్లు అలసట, బలహీనత వంటి లక్షణాలు కనిపించే వరకు బయటపడదు. కంప్లీట్ బ్లడ్ కౌంట్ పరీక్ష అనేది త్వరి త, సులభమైన స్క్రీనింగ్ పరీక్ష. పీరియడ్ లేదా గర్భిణీ స్త్రీలు, ఎటువంటి కారణం లేకుండా అలసటగా అనిపించే మహిళలకు ఇది కీలకమైన స్క్రీనింగ్ పరీక్ష.
విటమిన్ లోపాలు
విటమిన్ డి, బి12 లోపం సర్వసాధారణం. మహిళల్లో విస్త్రృతంగా ఉంటుంది. ముఖ్యంగా కీళ్ల నొప్పులు, అలసట లేదా మానసిక స్థితిలో మార్పులు ఉన్న స్త్రీలు తప్పనిసరిగా చేయించుకోవాలి.
ఎముకల ఆరోగ్యం
మెనోపాజ్ తర్వాత ఆస్టియోపోరోసిస్ మహిళలను మరింత ఆందోలనపరుస్తుం ది. 65 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయ స్సు ఉన్న మహిళలకు లేదా అంతకుముం దే బోన్ మినరల్ డెన్సిటీ టెస్ట్ చేయించుకుంటే మంచిది. అలాగే ఉదర, పెల్విక్ సోనోగ్రపీ అండాశయ క్యాన్సర్ను ముందస్తుగా గుర్తించడానికి ఉపయోగపడుతుంది.
ముఖ్యంగా కుటుంబంలో ఎవరికైనా ఉంటే అసాధారణ గర్భాశయ రక్తస్రావం, పీసీఓఎస్ నిర్వహణ, రుతుక్రమం ఆగిపోయిన తర్వాత రక్తస్రావం, సంతానోత్పత్తి సమస్యల గురించి గైనకాలజిస్ట్తో చర్చించేందుకు ప్రాధాన్యతనివ్వాలి.