27-06-2025 01:51:26 AM
ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్
జగిత్యాల అర్బన్, జూన్ 26 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు పక్షపాతి అని, రైతుల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుందని ఎమ్మెల్యే డాక్ట ర్ సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల రూరల్ మండలం గొల్లపల్లె గ్రామంలో రు.20 లక్షల నిధులతో నూతనంగా నిర్మించిన గ్రామపంచాయతీ భవనాన్ని ఎమ్మెల్యే ప్రారంభించి అనంతరం మొక్కను నాటారు .గ్రామంలో మండల పరిషత్ నిధులు రు.2 లక్షలతో నిర్మించే డ్రైనేజీ నిర్మాణానికి, ఛత్రపతి శివాజీ విగ్రహ ఏర్పాటుకు భూమిపూజ చేసారు.
ఈ ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు పక్షపాతి ప్రభుత్వమన్నారు. రు.70 లక్షల రైతు కు టుంబాలకు 9 రోజుల్లో 9వేల కోట్లతో రైతు భరోసా నిధులు జమ చేశారని తెలిపారు. రూ. 25 వేల కోట్లతో ఏక కాలం లో రుణ మాఫీ చేసిన ఘనత తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానిదని ఎ మ్మెల్యే అన్నారు.గ్రామంలో రూ. 21 లక్షలతో సిసి రోడ్లు, డ్రైనేజీలు నిర్మిస్తామన్నారు.
ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం చేసేందుకు ఉచితంగా పాఠ్య పుస్తకాలు అందజేస్తూ మధ్యాహ్న భోజనానికి సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ప్రకాష్, మాజీ జడ్పీటీసీ ఎల్లారెడ్డి, సదాశివ రావు, బాల ముకుందం, మాజీ ఎంపిటిసి శంకర్, ఎంపీడీవో రమాదేవి, ఎమ్మార్వో శ్రీనివాస్, ఎంఈఓ గాయత్రి, ఏయి రాజమల్లయ్య, నాయకులు, అధికారులుపాల్గొన్నారు.