27-06-2025 01:52:48 AM
సనత్ నగర్, జూన్ 26 (విజయ క్రాంతి):- బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణానికి రావాలంటూ మాజీమంత్రి, తలసాని శ్రీనివాస్ యాదవ్కు బల్కంపేట ఎల్లమ్మ కళ్యా ణానికి సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్కు ఆహ్వానాన్ని అందజేశారు. గురువారం వెస్ట్ మారేడ్పల్లిలోని కార్యాలయంలో ఆలయ అధికారులు ఎమ్మెల్యేను కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు.
ఆలయ పండితులు వేద మంత్రాలతో ఆశీర్వచనం చేసి ప్రసాదాలు అందజేశారు. ఈ సం దర్భంగా ఆయన మాట్లాడుతూ అమ్మవారి కళ్యాణానికి వచ్చే భక్తులు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా అన్ని జాగ్రత్తలు తీసు కోవాలని అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ నామన శేషుకుమారి, ఆలయ ట్రస్టీ చైర్మన్ సాయిబాబాగౌడ్, ఈఓ మహేందర్గౌడ్, సూప రింటెండెంట్ హైమావతి, అమీర్పేట డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు హన్మంతరావు, నాయకులు అశోక్యాదవ్, కూతురు నర్సిం హ, బలరాం, వనం శ్రీనివాస్ పాల్గొన్నారు.