calender_icon.png 30 June, 2025 | 7:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వేతనాలు అందక అవస్థల్లో ఔవుట్‌సోర్సింగ్ ఉద్యోగులు

30-06-2025 12:00:55 AM

మూడు నెలలుగా లేని జీతాలు, బతుకు భారం... బండెడు చాకిరీ

భద్రాద్రి కొత్తగూడెం జూన్ 29 (విజయ క్రాంతి) బతుకు భారం.... బండడు చాకరి... చాలీచాలని వేత నం... సమయానికి అందని జీతం ఇది భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అవుట్ సోర్సింగ్ ద్వారా విధులు నిర్వహిస్తున్న ఆరోగ్య మిత్రల పరిస్థితి. జిల్లా వ్యాప్తంగా 34 మంది ఆరోగ్య మిత్రులు ఔట్సోర్సింగ్ ద్వా రా విధులు నిర్వహిస్తున్నారు. గత మూడు నెలలుగా వేతనాలు అందక అవస్థలు పడుతున్నారు.

ప్రభుత్వం ఔట్సోర్సింగ్ ద్వారా ప్రైవేట్ ఏజెన్సీల తో నియామకాలు చేపడతారు. ఆ ఏజెన్సీలో సకాలంలో ఈపీఎఫ్, ఈఎస్‌ఐ తప్పనిసరిగా ప్రతినెల చెల్లించా ల్సి ఉంటుంది. అవి చెల్లిస్తేనే అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు వేతనాలు మంజూరు చేస్తారు. గతంలో పర్ఫెక్ట్ ఏజెన్సీ ద్వారా నియమితులైన ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సకాలంలో ఈపీఎఫ్, ఈఎస్‌ఐ చెల్లించకపోవడం ఆ విషయాన్ని విజయ క్రాంతి వెలుగులోకి తీసుకురావడం జరిగింది.

ఈపీఎఫ్, ఈఎస్‌ఐ చెల్లించని కారణంగా వారి జీతాల బిల్లులు నిలిచిపోయాయి. ఆ ఏజెన్సీని రద్దు చేస్తూ కొత్త ఏజెన్సీ ద్వారా జీతభత్యాలు ఇచ్చేందుకు ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ఒప్పందం కుదరచుకుంది. ఈ ఏజెన్సీ సైతం సకాలంలో రికార్డులను సమర్పించకపోవడంతో ఆరోగ్యం మిత్ర ఉద్యోగులకు రావలసిన వేతనాలు నిలిచిపోయాయి. ఫలితంగా వారి బతుకు అఘమ్య గోచరంగా మారింది. 

బడి ఫీజులు చెల్లించలేక....

అసలే జూన్ మాసం, కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే రోజులు, తిన్న తినకపోయినా పిల్లల్ని పాఠశాలలో చేర్పించాల్సిన ఆవశ్యకత ఉంది. వేతనాలు రాక బడి ఫీజులు చెల్లించడానికి అప్పులు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. ఒకవైపు ఇల్లు గడవడం కష్టం గా ఉండటం, మరోవైపు పిల్లల్ని పాఠశాలలో చేర్పించేందుకు అప్పుల బారీణ పడుతున్న పరిస్థితిని కలెక్టర్ కు విన్నవించుకున్న ఫలితం లేకుండా పోయిందనీ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

 ఇలాంటి దుర్భర పరిస్థితి మున్నన్నడు రాలేదని ఆరోగ్య మిత్ర సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ప్రదీప్ అంటున్నారు. బడ్జెట్ తో మా వేతనాలకు సంబంధం ఉండదని, ట్రస్టులో నిధులు ఉంటాయని, కొత్త ఏజెన్సీ డిపాజిట్ సొమ్ము రూ 5 లక్షలు చెల్లించకపోవడం, ఏజెన్సీ తీసుకోవాలా, తీసుకోవద్దా అనే మీమాంసంలో ఉండటం వల్లనే ఈ సమస్య ఉత్పన్నమైంది అన్నారు.

బడ్జెట్ రిలీజ్ కాకపోవడమే కారణం:ఎంప్లాయిమెంట్ అధికారి శ్రీరామ్

రాష్ట్ర ప్రభుత్వం మార్చి తర్వాత బడ్జెట్ రిలీజ్ చేయకపోవడం వల్ల ఆరోగ్యం మిత్ర ఉద్యోగులకు రావలసిన వేతనాలు నిలిచిపోయాయని జిల్లా ఎంప్లాయిమెంట్ అధికారి శ్రీరామ్ అంటున్నారు. బడ్జెట్ రిలీజ్ అయిన వెంటనే వేతనాలు చెల్లిస్తారన్నారు.